ETV Bharat / city

వాగులో కొట్టుకుపోయిన 13ఏళ్ల బాలుడు... కాపాడేందుకు వెళ్లి పెదనాన్న మృతి...

author img

By

Published : Jan 4, 2021, 10:28 AM IST

చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు.. ఈతకు వెళ్లి మరో ఇద్దరు మృతి చెందిన ఘటనలు గుంటూరు, ప్రకాశం జిల్లాలో జరిగాయి. ఈ రెండు ఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

three members dead by fell down in water
వాగులో పడి పెదనాన్న, కొడుకు మృతి.. ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు

చేపలు పట్టేందుకు వెళ్లి.. తమ్ముడు కుమారుడు వాగులో కొట్టుకుపోవటం గమనించిన పెదనాన్న.. కాపాడేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతనూ వాగులో మునిగి ప్రాణాలు విడిచాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెంలో జరిగిందీ దుర్ఘటన.

సరదాగా చేపలు పట్టేందుకు 13 ఏళ్ల బాలుడు వాగులోకి దిగాడు. ప్రమాదవశాత్తు బయటకు రాలేకపోయాడు. తమ్ముడి కుమారుడు అలా వాగులో కొట్టుకుపోవడాన్ని గమనించిన పెదనాన్న... బాలుణ్ని రక్షించేందుకు యత్నించాడు. ఆయన కూడా వాగులో దూకాడు. అంతే అతను కూడా ఊబిలో ఇర్కుపోయి ఊపిరి వదిలాడు.

ఈ దుర్ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. బాలుడి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాలుడి పెదనాన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈత సరదా తీసింది ప్రాణం

ప్రకాశం జిల్లా వల్లపల్లి సమీపంలోని అద్దంకి బ్రాంచి కాలువ వద్ద ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గమనించిన స్థానిక మహిళలు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కాపాడారు. మరో వ్యక్తి శేషయ్య అప్పటికే మృతి చెందాడు. వీరు ఇరువురు ధర్మారం గ్రామానికి చెందినవారుగా స్థానికులు గుర్తించారు. వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండటం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు.

ఇవీ చూడండి...

దాచేపల్లిలో తెదేపా నేత దారుణ హత్య

చేపలు పట్టేందుకు వెళ్లి.. తమ్ముడు కుమారుడు వాగులో కొట్టుకుపోవటం గమనించిన పెదనాన్న.. కాపాడేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతనూ వాగులో మునిగి ప్రాణాలు విడిచాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెంలో జరిగిందీ దుర్ఘటన.

సరదాగా చేపలు పట్టేందుకు 13 ఏళ్ల బాలుడు వాగులోకి దిగాడు. ప్రమాదవశాత్తు బయటకు రాలేకపోయాడు. తమ్ముడి కుమారుడు అలా వాగులో కొట్టుకుపోవడాన్ని గమనించిన పెదనాన్న... బాలుణ్ని రక్షించేందుకు యత్నించాడు. ఆయన కూడా వాగులో దూకాడు. అంతే అతను కూడా ఊబిలో ఇర్కుపోయి ఊపిరి వదిలాడు.

ఈ దుర్ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. బాలుడి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాలుడి పెదనాన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈత సరదా తీసింది ప్రాణం

ప్రకాశం జిల్లా వల్లపల్లి సమీపంలోని అద్దంకి బ్రాంచి కాలువ వద్ద ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గమనించిన స్థానిక మహిళలు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కాపాడారు. మరో వ్యక్తి శేషయ్య అప్పటికే మృతి చెందాడు. వీరు ఇరువురు ధర్మారం గ్రామానికి చెందినవారుగా స్థానికులు గుర్తించారు. వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండటం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు.

ఇవీ చూడండి...

దాచేపల్లిలో తెదేపా నేత దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.