ETV Bharat / city

Sector Policing in Guntur: సెక్టార్ పోలీసింగ్.. నేరాలపై సరికొత్త నిఘా..! - Guntur police patrolling

Sector Policing in Guntur: నేరాలకు చెక్ పెట్టేందుకు గుంటూరు అర్బన్ పోలీసులు సరికొత్త విధానాన్ని తీసుకువచ్చారు. సెక్టార్‌ పోలీసింగ్‌ ద్వారా గుంటూరు పరిధిలో నేరాలు అడ్డుకోవడంమే కాదు.. ఎప్పుడైనా, ఏక్షణమైనా మేమున్నామనే ధైర్యాన్ని ప్రజల్లో కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

Sector Policing in Guntur
సెక్టార్ పోలీసింగ్...నేరాలపై సరికొత్త నిఘా...
author img

By

Published : Jan 7, 2022, 5:01 PM IST

Sector Policing in Guntur: ఏదైనా సమస్యపై పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అధికారులు అంత త్వరగా స్పందించరని, స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారనే విమర్శ ఉంది. ఫిర్యాదుదారులు చేసే ఇలాంటి విమర్శలకు తావులేకుండా సరికొత్త విధానానికి గుంటూరు అర్బన్ పోలీసులు కార్యరూపం ఇచ్చారు. "సెక్టార్‌ పోలింగ్‌" విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఒక్కో సర్కిల్లో మూడు నుంచి నాలుగేసి సెక్టార్లు ఏర్పాటు చేశారు. వాటికి ఎస్.ఐ.లను ఇన్‌ఛార్జులుగా నియమించి శాంతిభద్రతలను పర్యవేక్షించే విధానానికి శ్రీకారం చుట్టారు.

సెక్టార్ పోలీసింగ్...నేరాలపై సరికొత్త నిఘా...

బాధితులు తమ వినతిని ఎవరికి చెప్పాలి? ఎవరిని కలిసి కేసు పురోగతి తెలుసుకోవాలనే విషయాలను ఫ్లెక్సీలలో ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతానికి ఎవరు ఎస్సై తెలిసేలా వారి వివరాలు, ఫోన్ నంబర్లు ముద్రించడంతో నేరుగా ఫిర్యాదుదారులు ఆ అధికారిని కలిసే అవకాశం ఏర్పడింది. ప్రతీ పోలీసు స్టేషన్లో ఉండే కానిస్టేబుళ్లను ఆయా సెక్టార్ల పరిధిలో ఎస్సైలకు తోడుగా పనిచేసేలా రోజువారీ చార్ట్‌ వేస్తున్నారు. గతంలో స్పష్టమైన పని విభజనలేక ఇబ్బందులు వచ్చేవి. సెక్టార్ విధానం వల్ల నేరాల నివారణ, నియంత్రణ, తక్షణ సాయం అందుబాటులోకి వస్తుందని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.

" జనవరి 1 నుంచి ఈ సెక్టార్ విధానం చేపట్టాం. జనాభా, నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను చూసి సెక్టార్లుగా విభజించాము. ఈ సెక్టార్ లకు ఇన్‌ఛార్జులుగా ఎస్.ఐ.లను నియమించాము. వారు ఆ ప్రాంతాల్లో నేరాల పరిశీలన, పరిశోధన, శాంతిభద్రతలను పర్యవేక్షారు. ఈ విధంగా చేయడం ద్వారా స్టేషన్లలో పేరుకుపోయిన విచారణలో ఉన్న కేసులు తగ్గుతాయని భావిస్తున్నాము." -ఆరిఫ్ హఫీజ్, గుంటూరు అర్బన్ ఎస్పీ

గుంటూరు అర్బన్ పరిధిలో అధికారులు రాత్రిపూట గస్తీ తిరుగుతూ శివారు కాలనీల్లో ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నేరాలకు అస్కారమున్న ప్రదేశాలు, వ్యక్తుల గురించి తెలుసుకుంటూ నేరాల నివారణకు కృషిచేస్తున్నారు.

"రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేశాం. వాహనాలను కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనుమానితుల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్నాం. నేరాల నివారణే కాదు ప్రజల్లో పోలీసులపై నమ్మకం రావడం కూడా ముఖ్యం." - ఆరిఫ్ హఫీజ్, గుంటూరు అర్బన్ ఎస్పీ

నేరాల నియంత్రణ కంటే నివారణే ముఖ్యమంటూ గుంటూరు అర్బన్ పోలీసులు తీసుకు వస్తున్న కొత్త విధానాలు ఫలితాలనిస్తున్నాయి.

ఇదీ చదవండి : Old RTC Buses in New Look : పాత బస్సులకు కొత్త రూపు...

Sector Policing in Guntur: ఏదైనా సమస్యపై పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అధికారులు అంత త్వరగా స్పందించరని, స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారనే విమర్శ ఉంది. ఫిర్యాదుదారులు చేసే ఇలాంటి విమర్శలకు తావులేకుండా సరికొత్త విధానానికి గుంటూరు అర్బన్ పోలీసులు కార్యరూపం ఇచ్చారు. "సెక్టార్‌ పోలింగ్‌" విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఒక్కో సర్కిల్లో మూడు నుంచి నాలుగేసి సెక్టార్లు ఏర్పాటు చేశారు. వాటికి ఎస్.ఐ.లను ఇన్‌ఛార్జులుగా నియమించి శాంతిభద్రతలను పర్యవేక్షించే విధానానికి శ్రీకారం చుట్టారు.

సెక్టార్ పోలీసింగ్...నేరాలపై సరికొత్త నిఘా...

బాధితులు తమ వినతిని ఎవరికి చెప్పాలి? ఎవరిని కలిసి కేసు పురోగతి తెలుసుకోవాలనే విషయాలను ఫ్లెక్సీలలో ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతానికి ఎవరు ఎస్సై తెలిసేలా వారి వివరాలు, ఫోన్ నంబర్లు ముద్రించడంతో నేరుగా ఫిర్యాదుదారులు ఆ అధికారిని కలిసే అవకాశం ఏర్పడింది. ప్రతీ పోలీసు స్టేషన్లో ఉండే కానిస్టేబుళ్లను ఆయా సెక్టార్ల పరిధిలో ఎస్సైలకు తోడుగా పనిచేసేలా రోజువారీ చార్ట్‌ వేస్తున్నారు. గతంలో స్పష్టమైన పని విభజనలేక ఇబ్బందులు వచ్చేవి. సెక్టార్ విధానం వల్ల నేరాల నివారణ, నియంత్రణ, తక్షణ సాయం అందుబాటులోకి వస్తుందని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.

" జనవరి 1 నుంచి ఈ సెక్టార్ విధానం చేపట్టాం. జనాభా, నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను చూసి సెక్టార్లుగా విభజించాము. ఈ సెక్టార్ లకు ఇన్‌ఛార్జులుగా ఎస్.ఐ.లను నియమించాము. వారు ఆ ప్రాంతాల్లో నేరాల పరిశీలన, పరిశోధన, శాంతిభద్రతలను పర్యవేక్షారు. ఈ విధంగా చేయడం ద్వారా స్టేషన్లలో పేరుకుపోయిన విచారణలో ఉన్న కేసులు తగ్గుతాయని భావిస్తున్నాము." -ఆరిఫ్ హఫీజ్, గుంటూరు అర్బన్ ఎస్పీ

గుంటూరు అర్బన్ పరిధిలో అధికారులు రాత్రిపూట గస్తీ తిరుగుతూ శివారు కాలనీల్లో ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నేరాలకు అస్కారమున్న ప్రదేశాలు, వ్యక్తుల గురించి తెలుసుకుంటూ నేరాల నివారణకు కృషిచేస్తున్నారు.

"రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేశాం. వాహనాలను కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనుమానితుల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్నాం. నేరాల నివారణే కాదు ప్రజల్లో పోలీసులపై నమ్మకం రావడం కూడా ముఖ్యం." - ఆరిఫ్ హఫీజ్, గుంటూరు అర్బన్ ఎస్పీ

నేరాల నియంత్రణ కంటే నివారణే ముఖ్యమంటూ గుంటూరు అర్బన్ పోలీసులు తీసుకు వస్తున్న కొత్త విధానాలు ఫలితాలనిస్తున్నాయి.

ఇదీ చదవండి : Old RTC Buses in New Look : పాత బస్సులకు కొత్త రూపు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.