ETV Bharat / city

గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం... ఒక్కరోజే 300పైగా కేసులు

author img

By

Published : Jul 10, 2020, 6:01 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ హడలెత్తిస్తోంది. ఒక్కరోజే అత్యధికంగా 3 వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల ఉద్ధృతి దృష్ట్యా జిల్లాలో దుకాణాలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరవాలని వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నాయి.

గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం... ఒక్కరోజే 300పైగా కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం... ఒక్కరోజే 300పైగా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. గుంటూరు నగరంలోనే కొత్తగా 185 మందికి వైరస్‌ సోకింది. తాడేపల్లి మండలంలో 29, మంగళగిరి మండలంలో 20, గుంటూరు గ్రామీణ మండలంలో 15, నరసరావుపేట మండలంలో 15, మాచర్ల మండలంలో 8, తెనాలి, చిలకలూరిపేటలో 6 చొప్పున, వినుకొండ, పొన్నూరులో ఐదేసి కేసుల చొప్పున వచ్చాయి. వట్టి చెరుకూరు, దాచేపల్లి మండలాల్లో మూడేసి, అమరావతి, ఫిరంగిపురం, చేబ్రోలు, తుళ్లూరు, మేడి కోండూరు, సత్తెనపల్లి, పెద్దకాకాని, పత్తిపాడులో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

తెనాలి మున్సిపల్​ కమిషనర్​కు పాజిటివ్​

తెనాలి నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య 151కు చేరింది. తెనాలిలోనే 113 కేసులు ఉన్నాయి. తెనాలి మున్సిపల్ కమిషనర్​కు కరోనా సోకగా.. కార్యాలయాన్ని మూసివేశారు. రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆయాచోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. సత్తెనపల్లిలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం మర్చిపోయారని మహిళలు ఆందోళన చేపట్టారు. మేడికొండూరు మండంలోని పేరిచర్లలో మెకానిక్‌గా పనిచేసే వ్యక్తి బుధవారం మృతిచెందగా..ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న 47 మంది మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

దుకాణ వేళల్లో మార్పులు

గుంటూరు జిల్లాలో కేసుల ఉద్ధృతి రీత్యా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో వర్తక, వాణిజ్యసంస్థల తెరిచే వేళలను జిల్లా ఛాంబర్ ఆప్ కామర్స్ స్వచ్ఛందంగా కుదించింది. ఇక నుంచి గుంటూరు జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే వర్తక, వాణిజ్య సంస్థలు, దుకాణాలు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు.

గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లా అధికారులు పరీక్షలు వేగవంతం చేయడంతోపాటు యాంటీజెన్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇదీ చదవండి : దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: మంత్రి సురేశ్

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. గుంటూరు నగరంలోనే కొత్తగా 185 మందికి వైరస్‌ సోకింది. తాడేపల్లి మండలంలో 29, మంగళగిరి మండలంలో 20, గుంటూరు గ్రామీణ మండలంలో 15, నరసరావుపేట మండలంలో 15, మాచర్ల మండలంలో 8, తెనాలి, చిలకలూరిపేటలో 6 చొప్పున, వినుకొండ, పొన్నూరులో ఐదేసి కేసుల చొప్పున వచ్చాయి. వట్టి చెరుకూరు, దాచేపల్లి మండలాల్లో మూడేసి, అమరావతి, ఫిరంగిపురం, చేబ్రోలు, తుళ్లూరు, మేడి కోండూరు, సత్తెనపల్లి, పెద్దకాకాని, పత్తిపాడులో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

తెనాలి మున్సిపల్​ కమిషనర్​కు పాజిటివ్​

తెనాలి నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య 151కు చేరింది. తెనాలిలోనే 113 కేసులు ఉన్నాయి. తెనాలి మున్సిపల్ కమిషనర్​కు కరోనా సోకగా.. కార్యాలయాన్ని మూసివేశారు. రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆయాచోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. సత్తెనపల్లిలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం మర్చిపోయారని మహిళలు ఆందోళన చేపట్టారు. మేడికొండూరు మండంలోని పేరిచర్లలో మెకానిక్‌గా పనిచేసే వ్యక్తి బుధవారం మృతిచెందగా..ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న 47 మంది మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

దుకాణ వేళల్లో మార్పులు

గుంటూరు జిల్లాలో కేసుల ఉద్ధృతి రీత్యా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో వర్తక, వాణిజ్యసంస్థల తెరిచే వేళలను జిల్లా ఛాంబర్ ఆప్ కామర్స్ స్వచ్ఛందంగా కుదించింది. ఇక నుంచి గుంటూరు జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే వర్తక, వాణిజ్య సంస్థలు, దుకాణాలు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు.

గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లా అధికారులు పరీక్షలు వేగవంతం చేయడంతోపాటు యాంటీజెన్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇదీ చదవండి : దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.