రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాని(jagananna house)కి ప్రజా ప్రతినిధులు శంకు స్థాపనులు చేశారు. అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నేరవేర్చుతామన్నారు.
గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 17 వేల ఇళ్ల నిర్మాణానికి మొదటి విడతలో సీఎం శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ...
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లను నిర్మించి ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా ...
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం, ఒమ్మంగి గ్రామాల్లో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేశారు. మొదటి విడతగా 8,490 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.
ప్రకాశం జిల్లా ...
ప్రకాశం జిల్లా మిల్లపల్లిలో వైఎస్సార్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణానికి మంత్రి ఆదిమూలపు సురేష్ శంకుస్థాపన చేశారు. అర్హులైన పేదవారికి సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. దసరా నాటికి ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.చీరాల మండలం పాతచీరాలలో గృహ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కరణం బలరాం శంకుస్థాపన చేశారు.
కృష్ణా జిల్లా...
కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో జగనన్న కాలనీల నిర్మాణానికి ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి మంత్రులు బుగ్గన, జయరాం శంకుస్థాపన చేశారు.
చిత్తురూ జిల్లా
చిత్తురూ జిల్లా పుంగనూరు మండలం కుమారనత్తం గ్రామంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగనన్న కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతపురం జిల్లా...
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బీటీపీ రోడ్లో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి శంకు స్థాపన చేశారు. రాయదుర్గం పట్టణంలో 1,549 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు అయినట్లు తెలిపారు. ధోని ముక్కల రోడ్డులో ఇళ్ల నిర్మాణ కార్యక్రమానకి మంత్రి శంకర్ నారాయణ శ్రీకారం చుట్టారు.
విశాఖ జిల్లా
విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకిల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు...జగనన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 7,298 ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
విజయనగరం జిల్లా...
విజయనగరంజిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 98,286 మంది పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు
శ్రీకాకుళం జిల్లా...
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి... క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మంత్రి సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే కిరణ్ కుమార్ భూమి పూజ నిర్వహించారు.
ఇదీ చదవండి