ETV Bharat / city

తల్లిదండ్రులను కాపాడాలంటూ ఫేస్​బుక్​లో పోస్ట్​.. కాసేపటికే తల్లి మృతి​!

author img

By

Published : Jul 17, 2020, 12:49 AM IST

కరోనాతో పోరాడుతోన్న తన తల్లిని కాపాడుకోవాలన్న ఆ కుమారుని ఆశ ఫలించలేదు. ప్రభుత్వ వైద్యశాలలో తన తల్లిదండ్రులకు వైద్యం సరిగా అందడం లేదని.. వారికి వైద్యం అందేలా సహకరించాలని ఫేస్​బుక్​లో ఆవేదనతో పెట్టిన పోస్టు అందరినీ కలిచివేసింది. అయితే ఇంతలోనే ఆ యువకుని తల్లి ప్రాణాలు కోల్పోయింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన వివరాలివి.

తల్లిదండ్రులను కాపాడాలని ఫేస్​బుక్​లో పోస్ట్​.. ఇంతలోనే తల్లి మృతి​
తల్లిదండ్రులను కాపాడాలని ఫేస్​బుక్​లో పోస్ట్​.. ఇంతలోనే తల్లి మృతి​
తల్లిదండ్రులను కాపాడాలని ఫేస్​బుక్​లో కుమారుడి పోస్ట్​

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కిరాణా దుకాణం నడుపుతున్న భార్యాభర్తలకు మూడ్రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దంపతులిద్దరికీ కరోనా సోకిందని ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు.

మహిళకు అత్యవసర చికిత్స అందించారు. ఆమె పరిస్థితి క్షీణిస్తుండగా.. ఆసుపత్రి అధికారులు గుంటూరు ఎన్​ఆర్​ఐ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే మహిళ మృతి చెందింది. ఈ క్రమంలో అంబులెన్స్​ సిబ్బంది మృతదేహాన్ని తిరిగి నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకుండా అధికారులే ఖననం చేస్తామని చెప్పినట్లుగా తెలిసింది.

ఫేస్​బుక్​లో పోస్టు

కరోనా బాధితులైన తన తల్లిదండ్రులకు సరైన వైద్యం అందడం లేదని దంపతుల కుమారుడు వారి బాధను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. తన తల్లి ఆక్సిజన్​ అందక విలవిల్లాడిపోతోందని.. తన తండ్రికి కనీసం బెడ్​ కూడా ఏర్పాటు చేయలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను అధికారులకు చేరేలా సహకరించాలని కోరాడు. ఈ పోస్ట్​ పలువురిని ఆవేదనకు గురి చేసింది. అయితే ఇంతలోనే పరిస్థితి విషమించి మహిళ ప్రాణాలు కోల్పోవడం.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అందరినీ కలిచివేసింది.

ఇదీ చూడండి:

కరోనా రోగుల అంబులెన్స్​​... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్​

తల్లిదండ్రులను కాపాడాలని ఫేస్​బుక్​లో కుమారుడి పోస్ట్​

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కిరాణా దుకాణం నడుపుతున్న భార్యాభర్తలకు మూడ్రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దంపతులిద్దరికీ కరోనా సోకిందని ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు.

మహిళకు అత్యవసర చికిత్స అందించారు. ఆమె పరిస్థితి క్షీణిస్తుండగా.. ఆసుపత్రి అధికారులు గుంటూరు ఎన్​ఆర్​ఐ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే మహిళ మృతి చెందింది. ఈ క్రమంలో అంబులెన్స్​ సిబ్బంది మృతదేహాన్ని తిరిగి నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకుండా అధికారులే ఖననం చేస్తామని చెప్పినట్లుగా తెలిసింది.

ఫేస్​బుక్​లో పోస్టు

కరోనా బాధితులైన తన తల్లిదండ్రులకు సరైన వైద్యం అందడం లేదని దంపతుల కుమారుడు వారి బాధను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. తన తల్లి ఆక్సిజన్​ అందక విలవిల్లాడిపోతోందని.. తన తండ్రికి కనీసం బెడ్​ కూడా ఏర్పాటు చేయలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను అధికారులకు చేరేలా సహకరించాలని కోరాడు. ఈ పోస్ట్​ పలువురిని ఆవేదనకు గురి చేసింది. అయితే ఇంతలోనే పరిస్థితి విషమించి మహిళ ప్రాణాలు కోల్పోవడం.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అందరినీ కలిచివేసింది.

ఇదీ చూడండి:

కరోనా రోగుల అంబులెన్స్​​... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.