ETV Bharat / city

కరోనా రౌండప్​: జిల్లాలో కొత్తగా 817 పాజిటివ్ కేసులు - corona cases in ap

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా 817 పాజిటివ్ కేసులు నిర్ధరణ కావటంతో... జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 21,855కు చేరింది. కొత్తగా జిల్లాలో 9 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

corona positive cases conformed in guntoor district
corona positive cases conformed in guntoor district
author img

By

Published : Aug 7, 2020, 10:22 PM IST

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 817 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 21,855కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 161 ఉన్నాయి. ఇక నరసరావుపేట 135, రేపల్లె 61, కొల్లిపర 44, మాచర్ల 39, వట్టిచెరుకూరు 39, రొంపిచెర్ల 39, నూజెండ్ల 38, ఫిరంగిపురం 29, కారంపూడి 27, సత్తెనపల్లి 21, తెనాలి 20, చిలకలూరిపేట 20, నకరికల్లు 12, దుగ్గిరాల 10, బాపట్లలో 10 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 112 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా శుక్రవారం నాడు 9మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో 197మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువమంది జులై, ఆగస్టు నెలల్లోనే మరణించారు. కరోనా నుంచి 12,477మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పరీక్షల సంఖ్యను పెంచారు. రోజూ 6వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 2లక్షల 27వేల మందికి పరీక్షలు నిర్వహించారు.

ప్రతి 10లక్షల మందిలో 47వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొవిడ్ రోగుల కోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 5,500 పడకలు ఉన్నాయి. అలాగే 7 కోవిడ్ కేర్ కేంద్రాల్లో 2,247 పడకలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 817 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 21,855కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 161 ఉన్నాయి. ఇక నరసరావుపేట 135, రేపల్లె 61, కొల్లిపర 44, మాచర్ల 39, వట్టిచెరుకూరు 39, రొంపిచెర్ల 39, నూజెండ్ల 38, ఫిరంగిపురం 29, కారంపూడి 27, సత్తెనపల్లి 21, తెనాలి 20, చిలకలూరిపేట 20, నకరికల్లు 12, దుగ్గిరాల 10, బాపట్లలో 10 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 112 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా శుక్రవారం నాడు 9మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో 197మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువమంది జులై, ఆగస్టు నెలల్లోనే మరణించారు. కరోనా నుంచి 12,477మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పరీక్షల సంఖ్యను పెంచారు. రోజూ 6వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 2లక్షల 27వేల మందికి పరీక్షలు నిర్వహించారు.

ప్రతి 10లక్షల మందిలో 47వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొవిడ్ రోగుల కోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 5,500 పడకలు ఉన్నాయి. అలాగే 7 కోవిడ్ కేర్ కేంద్రాల్లో 2,247 పడకలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

సీఎస్​ అధ్యక్షతన జిల్లాల పునర్‌వ్యవస్థీరణకు కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.