ETV Bharat / city

సీఆర్‌డీఏపై సీబీఐ విచారణ కోరాలి: సీఎం జగన్

author img

By

Published : Sep 15, 2020, 5:20 AM IST

‘సీఆర్‌డీఏ పరిధిలో భూ కుంభకోణం, ఫైబర్‌గ్రిడ్‌లో అవినీతి చోటుచేసుకున్నాయని.. ఈ రెండు వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని వైకాపా ఎంపీలు నిర్ణయించారు. చంద్రబాబు, లోకేశ్‌లకు సంబంధించిన వారు ఈ అవకతవకల్లో భాగస్వాములుగా ఉన్నందున వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలోనే కేంద్రాన్ని కోరినా కదలిక లేదన్నారు.  అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సహా పలు అంశాలపై సీబీఐ విచారణ కోరుతున్నా కేంద్రం పెండింగులో పెడుతుండటంపైనా పార్లమెంటులో ప్రశ్నించాలని తీర్మానించారు.

ysrcp-mps-meeting-on-crda-issue
ysrcp-mps-meeting-on-crda-issue

పార్లమెంటు సమావేశాల క్రమంలో సోమవారం వైకాపా ఎంపీలతో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దిల్లీలోని ఏపీ భవన్‌ నుంచి ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మొత్తం 17 అంశాల గురించి ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. తెదేపా ప్రస్తావించే అంశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉంటే వెంటనే తిప్పికొట్టాలన్నారు. నరసాపురం ఎంపీ రఘురామపై అనర్హత వేటుపైనా మాట్లాడాలని నిర్ణయించారు. వైకాపా కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం సీఎం ఏంచెప్పారంటే..

పోలవరానికి నిధులు అడగండి

ప్రాజెక్టు పనులకు రావాల్సిన రూ.3,232 కోట్లు, ప్రాజెక్టులో 41.5 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు పునరావాస పనులకు రూ.3 వేల కోట్లు ఇచ్చేలా ఒత్తిడి తేవాలి. ప్రాజెక్టుకు ఇంకా రూ.30 వేల కోట్లకుపైగా వ్యయమవుతుందనీ పార్లమెంటులో ప్రస్తావించాలి.

  • కొవిడ్‌ నేపథ్యంలో బకాయిలున్న జీఎస్టీ పరిహారం రూ.3,622 కోట్లు, పౌరసరఫరాల సంస్థకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.1300 కోట్ల విడుదలకు పట్టుబట్టాలి. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన రూ.582 కోట్లను రాబట్టాలి.
  • గరీబ్‌ కల్యాణ్‌ పథకంలో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని 7జిల్లాలను చేర్చాలని కేంద్రాన్ని కోరాలి.
  • ఏపీ దిశ బిల్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ చేసిన బిల్లును ఆమోదించాలని పార్లమెంటులో ప్రస్తావించాలి.
  • శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించి పంపినా కేంద్రం పట్టించుకోలేదు.దీనిపై మాట్లాడాలి.

పక్క రాష్ట్రాల లాబీ: మిథున్‌ రెడ్డి

సమావేశానంతరం వైకాపా లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘అరకు కాఫీ తోటల్లో పనిచేసే కూలీలను ఉపాధిహామీ పరిధిలోకి తీసుకురావాలని కోరతాô. మా పోరాటం వల్లే ప్రత్యేకహోదా అంశం ఇంకా ఉంది. ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రాలు మనకు ప్రత్యేకహోదా రాకుండా లాబీ చేస్తున్నాయి’ అన్నారు.

పిలిచారు.. పొమ్మన్నారు: రఘురామ

ఈనాడు, దిల్లీ: పార్టీ ఎంపీల సమావేశానికి తనను పిలిచి కొద్ది గంటల్లోనే మళ్లీ రావద్దు పొమ్మన్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం జగన్‌ ఎంపీలతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశానికి ఉదయం నన్ను ఆహ్వానించారు. తర్వాత పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు సమావేశానికి రావద్దంటూ చెప్పారు. దీనిపై సభాపతి ఓం బిర్లాకు లేఖ రాశా. పార్టీ నుంచి నన్ను బహిష్కరించినట్లే భావిస్తున్నా. అమరావతిలోనే రాజధాని ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పారు కాబట్టి జగన్‌ ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటే మళ్లీ గెలిపిస్తారు’ అన్నారు. కేంద్ర హోం కార్యదర్శి అజయ్‌భల్లాను రఘురామ కలిసి అమరావతిపై 29వేల మంది రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందపత్రాల ప్రతులను అందజేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా కేసులు, 60 మరణాలు

పార్లమెంటు సమావేశాల క్రమంలో సోమవారం వైకాపా ఎంపీలతో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దిల్లీలోని ఏపీ భవన్‌ నుంచి ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మొత్తం 17 అంశాల గురించి ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. తెదేపా ప్రస్తావించే అంశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉంటే వెంటనే తిప్పికొట్టాలన్నారు. నరసాపురం ఎంపీ రఘురామపై అనర్హత వేటుపైనా మాట్లాడాలని నిర్ణయించారు. వైకాపా కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం సీఎం ఏంచెప్పారంటే..

పోలవరానికి నిధులు అడగండి

ప్రాజెక్టు పనులకు రావాల్సిన రూ.3,232 కోట్లు, ప్రాజెక్టులో 41.5 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు పునరావాస పనులకు రూ.3 వేల కోట్లు ఇచ్చేలా ఒత్తిడి తేవాలి. ప్రాజెక్టుకు ఇంకా రూ.30 వేల కోట్లకుపైగా వ్యయమవుతుందనీ పార్లమెంటులో ప్రస్తావించాలి.

  • కొవిడ్‌ నేపథ్యంలో బకాయిలున్న జీఎస్టీ పరిహారం రూ.3,622 కోట్లు, పౌరసరఫరాల సంస్థకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.1300 కోట్ల విడుదలకు పట్టుబట్టాలి. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన రూ.582 కోట్లను రాబట్టాలి.
  • గరీబ్‌ కల్యాణ్‌ పథకంలో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని 7జిల్లాలను చేర్చాలని కేంద్రాన్ని కోరాలి.
  • ఏపీ దిశ బిల్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ చేసిన బిల్లును ఆమోదించాలని పార్లమెంటులో ప్రస్తావించాలి.
  • శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించి పంపినా కేంద్రం పట్టించుకోలేదు.దీనిపై మాట్లాడాలి.

పక్క రాష్ట్రాల లాబీ: మిథున్‌ రెడ్డి

సమావేశానంతరం వైకాపా లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘అరకు కాఫీ తోటల్లో పనిచేసే కూలీలను ఉపాధిహామీ పరిధిలోకి తీసుకురావాలని కోరతాô. మా పోరాటం వల్లే ప్రత్యేకహోదా అంశం ఇంకా ఉంది. ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రాలు మనకు ప్రత్యేకహోదా రాకుండా లాబీ చేస్తున్నాయి’ అన్నారు.

పిలిచారు.. పొమ్మన్నారు: రఘురామ

ఈనాడు, దిల్లీ: పార్టీ ఎంపీల సమావేశానికి తనను పిలిచి కొద్ది గంటల్లోనే మళ్లీ రావద్దు పొమ్మన్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం జగన్‌ ఎంపీలతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశానికి ఉదయం నన్ను ఆహ్వానించారు. తర్వాత పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు సమావేశానికి రావద్దంటూ చెప్పారు. దీనిపై సభాపతి ఓం బిర్లాకు లేఖ రాశా. పార్టీ నుంచి నన్ను బహిష్కరించినట్లే భావిస్తున్నా. అమరావతిలోనే రాజధాని ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పారు కాబట్టి జగన్‌ ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటే మళ్లీ గెలిపిస్తారు’ అన్నారు. కేంద్ర హోం కార్యదర్శి అజయ్‌భల్లాను రఘురామ కలిసి అమరావతిపై 29వేల మంది రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందపత్రాల ప్రతులను అందజేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా కేసులు, 60 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.