జగనన్న దీవెన పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ బాదుడుగా మారే ప్రమాదం ఉందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఓ వైపు దివాళాంధ్ర ప్రదేశ్గా మారుతుంటే.... సీఎం జగన్ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందన్నారు. మితిమీరిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక స్థితి నడిసంద్రంలో నావలా తయారైందని అభిప్రాయపడ్డారు. ఇకపై అప్పులు కూడా పుట్టే పరిస్థితి సైతం ఉండదని అన్నారు.
ఇదీ చదవండి:
'అవినీతికి పాల్పడుతున్నారు... తిరిగి ఎన్నికల్లో పంచుతున్నారు'