ETV Bharat / city

'ఎన్నికలు కరోనా వైరస్​ వల్ల కాదు.. క్యాస్ట్​ వైరస్​ వల్ల వాయిదా'

author img

By

Published : Mar 15, 2020, 8:03 PM IST

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కరోనా వైరస్​ వల్ల వాయిదా పడలేదని.. క్యాస్ట్​ వైరస్​ వల్ల వాయిదా పడ్డాయని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నికలు వాయిదా నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆయన.. తెదేపాకు అనుకూలంగా ఎన్నికల కమిషనర్​ ప్రక్రియ నిలిపేశారని విమర్శించారు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.

'ఎన్నికలు కరోనా వైరస్​ వల్ల కాదు.. క్యాస్ట్​ వైరస్​ వల్ల వాయిదా'
'ఎన్నికలు కరోనా వైరస్​ వల్ల కాదు.. క్యాస్ట్​ వైరస్​ వల్ల వాయిదా'
ఎన్నికల వాయిదా నిర్ణయంపై అంబటి విమర్శలు

స్థానిక ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్​ రమేష్​ కుమార్​ తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా నేతలు తప్పుబట్టారు. ఇది కేవలం ఏకపక్ష నిర్ణయమేనని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఈ నిర్ణయం కరోనా వైరస్​ వల్ల కాదని.. క్యాస్ట్​ వైరస్​ వల్ల తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా వైరస్​ పాజిటివ్​ కేసు నమోదైందన్న ఆయన.. ఆరు వారాల తర్వాత వైరస్​ ప్రభావం తగ్గకుంటే మళ్లీ వాయిదా వేస్తారా అని ఎన్నికల కమిషనర్​ను అంబటి ప్రశ్నించారు. రమేష్​కుమార్​ తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని.. ఆయన ప్రజా నాయకుడు కాదని.. మానిప్యులేటర్​ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వాయిదా సరికాదు

వాయిదా సరికాదన్న డొక్కా మాణిక్య వరప్రసాద్​

స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్​ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైకాపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్​ అన్నారు. పేదలకు మంచి చేకూర్చే ఇళ్ల పంపిణీని కోడ్​ సాకుతో నిలిపేశారని.. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

కరోనాతో భయపడాల్సిన అవసరం లేదు: సీఎం జగన్

ఎన్నికల వాయిదా నిర్ణయంపై అంబటి విమర్శలు

స్థానిక ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్​ రమేష్​ కుమార్​ తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా నేతలు తప్పుబట్టారు. ఇది కేవలం ఏకపక్ష నిర్ణయమేనని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఈ నిర్ణయం కరోనా వైరస్​ వల్ల కాదని.. క్యాస్ట్​ వైరస్​ వల్ల తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా వైరస్​ పాజిటివ్​ కేసు నమోదైందన్న ఆయన.. ఆరు వారాల తర్వాత వైరస్​ ప్రభావం తగ్గకుంటే మళ్లీ వాయిదా వేస్తారా అని ఎన్నికల కమిషనర్​ను అంబటి ప్రశ్నించారు. రమేష్​కుమార్​ తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని.. ఆయన ప్రజా నాయకుడు కాదని.. మానిప్యులేటర్​ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వాయిదా సరికాదు

వాయిదా సరికాదన్న డొక్కా మాణిక్య వరప్రసాద్​

స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్​ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైకాపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్​ అన్నారు. పేదలకు మంచి చేకూర్చే ఇళ్ల పంపిణీని కోడ్​ సాకుతో నిలిపేశారని.. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

కరోనాతో భయపడాల్సిన అవసరం లేదు: సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.