ETV Bharat / city

తెలంగాణ 'పురపోరు'కు.. తెదేపా సై - TTDP REVIEW MEETING IN NTR BHAVAN

తెలంగాణ రాజకీయాలపై.. తెదేపా అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్​లో ఆ రాష్ట్ర తెదేపా నేతలతో సమావేశమయ్యారు.

chandrababu
author img

By

Published : Nov 3, 2019, 10:12 AM IST

తెలంగాణ 'పురపోరు'కు.. తెదేపా సై

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బలమున్న చోట పోటీ చేయాలని తెదేపా ప్రాథమికంగా నిర్ణయించింది. హైదరాబాద్​లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధినేత చంద్రబాబుతో ఆ రాష్ట్ర తెదేపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. హుజూర్​నగర్ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె అంశాన్ని కూడా నేతలు బాబుకు వివరించారు. అధినేతను కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీనియర్ నేత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

'పుర ఎన్నికలపై బాబుతో నేతల సమాలోచనలు'

పురపాలిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో బాబు సమీక్షించారు. అనంతరం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్రబాబును కలిసి మీడియా హక్కులను కాపాడటంలో కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని.. అలాంటి విలేకరులకు సంకెళ్లు వేయడం నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని బాబు మండిపడ్డారు. మీడియా గొంతును నొక్కే జీవో 2430 రద్దుకు జర్నలిస్టు సంఘం చేస్తున్న పోరాటానికి వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు.

త్వరలోనే తెదేపా పార్లమెంట్ కమిటీలు

త్వరలో పార్లమెంట్ కమిటీలను ప్రకటిస్తామని తెదేపా తెలంగాణ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా...లేక పొత్తు పెట్టుకోవాలా అనే అంశాన్ని అప్పటి పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సమ్మె తదితర ప్రజాసమస్యలపై పార్టీ తరఫున పోరాడాలని బాబు సూచించినట్లు నర్సిరెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:

'నవంబర్​ 5 లోపు ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలి'

తెలంగాణ 'పురపోరు'కు.. తెదేపా సై

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బలమున్న చోట పోటీ చేయాలని తెదేపా ప్రాథమికంగా నిర్ణయించింది. హైదరాబాద్​లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధినేత చంద్రబాబుతో ఆ రాష్ట్ర తెదేపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. హుజూర్​నగర్ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె అంశాన్ని కూడా నేతలు బాబుకు వివరించారు. అధినేతను కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీనియర్ నేత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

'పుర ఎన్నికలపై బాబుతో నేతల సమాలోచనలు'

పురపాలిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో బాబు సమీక్షించారు. అనంతరం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్రబాబును కలిసి మీడియా హక్కులను కాపాడటంలో కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని.. అలాంటి విలేకరులకు సంకెళ్లు వేయడం నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని బాబు మండిపడ్డారు. మీడియా గొంతును నొక్కే జీవో 2430 రద్దుకు జర్నలిస్టు సంఘం చేస్తున్న పోరాటానికి వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు.

త్వరలోనే తెదేపా పార్లమెంట్ కమిటీలు

త్వరలో పార్లమెంట్ కమిటీలను ప్రకటిస్తామని తెదేపా తెలంగాణ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా...లేక పొత్తు పెట్టుకోవాలా అనే అంశాన్ని అప్పటి పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సమ్మె తదితర ప్రజాసమస్యలపై పార్టీ తరఫున పోరాడాలని బాబు సూచించినట్లు నర్సిరెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:

'నవంబర్​ 5 లోపు ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.