ETV Bharat / city

Polavaram: మారిన నదీ సహజ ప్రవాహ మార్గం..రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా డెల్టాకు నీళ్లు!

author img

By

Published : Jun 11, 2021, 2:49 PM IST

Updated : Jun 12, 2021, 5:02 AM IST

పోలవరం(Polavaram) ప్రాజెక్టు నుంచి డెల్టాకు స్పిల్‌ వే మీదుగా గోదావరి నీటిని విడుదల చేశారు. గోదావరిలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కావడంతో స్పిల్‌వే మీదుగా నీటిని మళ్లించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌(AnilKumar Yadav), ఆళ్ల నాని(Alla Nani) వర్చువల్‌గా పాల్గొన్నారు

polavaram
పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) చరిత్రలో ఇదో కీలకఘట్టం. గోదావరి(Godavari) సహజ ప్రవాహమార్గానికి ఎగువ కాఫర్‌ డ్యాంతో అడ్డుకట్ట వేసి నదీమార్గాన్ని మళ్లించారు. అప్రోచ్‌ ఛానల్‌ను కొంతమేర తవ్వి స్పిల్‌ వే మీదుగా నీటిని మళ్లించారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) స్పిల్‌ వే రివర్స్‌ స్లూయిస్‌ గేట్లు పదింటి ద్వారా తొలిసారిగా దిగువకు నీటిని వదిలిపెట్టారు. గోదావరి డెల్టా ఖరీఫ్‌ అవసరాలకు తొలిసారి ఇలా నీళ్లు వదిలారు. అంతకుముందు రెండేళ్లు స్పిల్‌ వే మీదుగా గోదావరి ప్రవాహాలు సాగినా కాఫర్‌ డ్యాంలో రెండుచోట్ల వదిలిన నది సహజమార్గాల మీదుగా కూడా ప్రవాహాలు మళ్లించారు. పూర్తిగా నదికి అడ్డుకట్ట నిర్మించి అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా పోలవరం రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా నీరు ఇవ్వడం ఇదే తొలిసారి. ఏ ప్రాజెక్టులోనైనా నది ప్రవాహమార్గంలోనే స్పిల్‌ వే నిర్మిస్తారు. పోలవరం వద్ద గోదావరి తీరు వల్ల, ఇక్కడి భూభౌతిక పరిస్థితుల వల్ల స్పిల్‌ వే నిర్మించడం అసాధ్యమని ఎప్పుడో తేల్చారు. అందువల్ల గోదావరి నదీమార్గాన్ని మళ్లించాలని ప్రణాళిక రచించారు. దాన్ని సాకారం చేసిన కీలక ఘట్టమిది. పోలవరం ప్రాజెక్టుకు ఎగువన సింగన్నపల్లి వద్ద నుంచి నది తన మార్గం నుంచి మళ్లి.. తిరిగి పోలవరం దిగువన సహజ నదిలో కలిసేవరకూ 6.6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలోనే అప్రోచ్‌ ఛానల్‌, తర్వాత స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, పైలట్‌ ఛానల్‌ ఉంటాయి. అప్రోచ్‌ ఛానల్‌ ఇంకా పూర్తిస్థాయిలో తవ్వాలి. ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం ఈ పనులు కొంత మేర చేసి నదిని మళ్లించారు.

సింగన్నపల్లి వద్ద పూజలు
పోలవరం(Polavaram) ఎగువన సింగన్నపల్లి వద్ద శుక్రవారం ఉదయం 12.15 గంటలకు జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి పూజలు చేసి నది ప్రవాహమార్గాన్ని మళ్లించారు. అప్రోచ్‌ ఛానల్‌(Approach Channel) వద్ద ఉన్న అడ్డుకట్టను తొలగించడంతో గోదారమ్మ మార్గం మార్చుకుని స్పిల్‌ వే వైపు పరుగులు తీసింది. జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌(AnilKumar), వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని(Alla Nani) , జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

'మేఘా'ది మరో మైలు రాయి
పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగు కంపెనీ అసోసియేట్‌ ఉపాధ్యక్షులు రంగరాజన్‌ మాట్లాడుతూ అప్రోచ్‌ ఛానల్‌ నుంచి నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి పోలవరం నిర్మాణంలో తమ సంస్థ మరో మైలురాయి సాధించిందన్నారు. తాము పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన తర్వాత భారీ వరదలు, కరోనా రెండు దశల సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. వీటిని అధిగమిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు పనులు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలవరం చీఫ్‌ ఇంజినీరు ఎం.సుధాకర్‌ బాబు, సలహాదారు గిరిధర్‌రెడ్డి, ఎస్‌ఈ కె.నరసింహమూర్తి, అధికారులు బాలకృష్ణ, ఆదిరెడ్డి, మల్లికార్జునరావు, మేఘా సంస్థ జనరల్‌ మేనేజర్లు, ఇతర అధికారులు ముద్దుకృష్ణ, దేవ్‌ ముని మిశ్రా, రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2022 ఖరీఫ్‌నకు నీళ్లు
ముఖ్యమంత్రి నిర్దేశించినట్లు పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఎడమ వైపు నుంచి ప్రవహించే గోదావరి(Godavari) నదిని కుడివైపు వెళ్లేలా మళ్లించడం కీలకఘట్టమని జలవనరులశాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి చెప్పారు. గోదావరిలో ప్రస్తుతం 23 టీఎంసీˆల నీళ్లు ఉన్నాయన్నారు. గోదావరిలో 15-24 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా వరదను నియంత్రించగలమన్నారు. 2022 ఖరీఫ్‌నకు పోలవరం నీళ్లు ఇచ్చేలా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో గతంలో ఖాళీలు వదిలేయడం వల్ల కొంతమేర డయాఫ్రం వాల్‌, పోలవరంపై గట్టు దెబ్బతిందని, ఆ పనులు సరిచేయడానికి అదనంగా పనులు చేయాల్సి వస్తోందన్నారు.

ఇదీ చదవండి:

బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం.. నైరుతి మరింత విస్తరించే అవకాశం

పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) చరిత్రలో ఇదో కీలకఘట్టం. గోదావరి(Godavari) సహజ ప్రవాహమార్గానికి ఎగువ కాఫర్‌ డ్యాంతో అడ్డుకట్ట వేసి నదీమార్గాన్ని మళ్లించారు. అప్రోచ్‌ ఛానల్‌ను కొంతమేర తవ్వి స్పిల్‌ వే మీదుగా నీటిని మళ్లించారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) స్పిల్‌ వే రివర్స్‌ స్లూయిస్‌ గేట్లు పదింటి ద్వారా తొలిసారిగా దిగువకు నీటిని వదిలిపెట్టారు. గోదావరి డెల్టా ఖరీఫ్‌ అవసరాలకు తొలిసారి ఇలా నీళ్లు వదిలారు. అంతకుముందు రెండేళ్లు స్పిల్‌ వే మీదుగా గోదావరి ప్రవాహాలు సాగినా కాఫర్‌ డ్యాంలో రెండుచోట్ల వదిలిన నది సహజమార్గాల మీదుగా కూడా ప్రవాహాలు మళ్లించారు. పూర్తిగా నదికి అడ్డుకట్ట నిర్మించి అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా పోలవరం రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా నీరు ఇవ్వడం ఇదే తొలిసారి. ఏ ప్రాజెక్టులోనైనా నది ప్రవాహమార్గంలోనే స్పిల్‌ వే నిర్మిస్తారు. పోలవరం వద్ద గోదావరి తీరు వల్ల, ఇక్కడి భూభౌతిక పరిస్థితుల వల్ల స్పిల్‌ వే నిర్మించడం అసాధ్యమని ఎప్పుడో తేల్చారు. అందువల్ల గోదావరి నదీమార్గాన్ని మళ్లించాలని ప్రణాళిక రచించారు. దాన్ని సాకారం చేసిన కీలక ఘట్టమిది. పోలవరం ప్రాజెక్టుకు ఎగువన సింగన్నపల్లి వద్ద నుంచి నది తన మార్గం నుంచి మళ్లి.. తిరిగి పోలవరం దిగువన సహజ నదిలో కలిసేవరకూ 6.6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలోనే అప్రోచ్‌ ఛానల్‌, తర్వాత స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, పైలట్‌ ఛానల్‌ ఉంటాయి. అప్రోచ్‌ ఛానల్‌ ఇంకా పూర్తిస్థాయిలో తవ్వాలి. ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం ఈ పనులు కొంత మేర చేసి నదిని మళ్లించారు.

సింగన్నపల్లి వద్ద పూజలు
పోలవరం(Polavaram) ఎగువన సింగన్నపల్లి వద్ద శుక్రవారం ఉదయం 12.15 గంటలకు జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి పూజలు చేసి నది ప్రవాహమార్గాన్ని మళ్లించారు. అప్రోచ్‌ ఛానల్‌(Approach Channel) వద్ద ఉన్న అడ్డుకట్టను తొలగించడంతో గోదారమ్మ మార్గం మార్చుకుని స్పిల్‌ వే వైపు పరుగులు తీసింది. జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌(AnilKumar), వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని(Alla Nani) , జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

'మేఘా'ది మరో మైలు రాయి
పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగు కంపెనీ అసోసియేట్‌ ఉపాధ్యక్షులు రంగరాజన్‌ మాట్లాడుతూ అప్రోచ్‌ ఛానల్‌ నుంచి నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి పోలవరం నిర్మాణంలో తమ సంస్థ మరో మైలురాయి సాధించిందన్నారు. తాము పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన తర్వాత భారీ వరదలు, కరోనా రెండు దశల సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. వీటిని అధిగమిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు పనులు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలవరం చీఫ్‌ ఇంజినీరు ఎం.సుధాకర్‌ బాబు, సలహాదారు గిరిధర్‌రెడ్డి, ఎస్‌ఈ కె.నరసింహమూర్తి, అధికారులు బాలకృష్ణ, ఆదిరెడ్డి, మల్లికార్జునరావు, మేఘా సంస్థ జనరల్‌ మేనేజర్లు, ఇతర అధికారులు ముద్దుకృష్ణ, దేవ్‌ ముని మిశ్రా, రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2022 ఖరీఫ్‌నకు నీళ్లు
ముఖ్యమంత్రి నిర్దేశించినట్లు పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఎడమ వైపు నుంచి ప్రవహించే గోదావరి(Godavari) నదిని కుడివైపు వెళ్లేలా మళ్లించడం కీలకఘట్టమని జలవనరులశాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి చెప్పారు. గోదావరిలో ప్రస్తుతం 23 టీఎంసీˆల నీళ్లు ఉన్నాయన్నారు. గోదావరిలో 15-24 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా వరదను నియంత్రించగలమన్నారు. 2022 ఖరీఫ్‌నకు పోలవరం నీళ్లు ఇచ్చేలా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో గతంలో ఖాళీలు వదిలేయడం వల్ల కొంతమేర డయాఫ్రం వాల్‌, పోలవరంపై గట్టు దెబ్బతిందని, ఆ పనులు సరిచేయడానికి అదనంగా పనులు చేయాల్సి వస్తోందన్నారు.

ఇదీ చదవండి:

బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం.. నైరుతి మరింత విస్తరించే అవకాశం

Last Updated : Jun 12, 2021, 5:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.