ETV Bharat / city

తెలంగాణలో బ్లాక్​ ఫంగస్​తో మరో వ్యక్తి మృతి

author img

By

Published : May 22, 2021, 3:54 PM IST

కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. తెలంగాణలోని వికారాబాద్​లో ఇటీవలే కరోనాను జయించిన ఓ వ్యక్తికి.. బ్లాక్​ ఫంగస్ సోకింది. పరిస్థితి విషమించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు.

black fungus
black fungus

బ్లాక్‌ఫంగస్‌తో తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె వాసి మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట్‌రెడ్డి(46) కన్నమూశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వెంకట్‌రెడ్డి.. కంటికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అస్వస్థతకు గురయ్యారు.

వెంకట్‌రెడ్డికి బ్లాక్‌ఫంగస్‌ సోకినట్లు జిల్లా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. నిన్న రాత్రి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వెంకట్‌రెడ్డి మృతి చెందారు.

బ్లాక్‌ఫంగస్‌తో తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె వాసి మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట్‌రెడ్డి(46) కన్నమూశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వెంకట్‌రెడ్డి.. కంటికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అస్వస్థతకు గురయ్యారు.

వెంకట్‌రెడ్డికి బ్లాక్‌ఫంగస్‌ సోకినట్లు జిల్లా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. నిన్న రాత్రి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వెంకట్‌రెడ్డి మృతి చెందారు.

ఇదీ చూడండి:

కొవిడ్​ రోగులతో క్యారమ్స్​ ఆడిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.