ETV Bharat / city

Twin Reservoirs : జంట జలాశయాలకు ఉద్ధృతంగా వరద

Twin Reservoirs : అర్ధరాత్రి అకస్మాత్తుగా కురిసిన వానకు భాగ్యనగరం అతలాకుతలమైంది. తెల్లవారి లేచి బయటకు వచ్చిన జనమంతా రోడ్లను చూసి షాకయ్యారు. చెరువులను తలపిస్తున్న రహదారులపై వెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హుస్సేన్​సాగర్​లో పూర్తిస్థాయి నీటిమట్టం దాటి వరద ప్రవాహం పోటెత్తుతోంది.

author img

By

Published : Jul 26, 2022, 11:44 AM IST

జంట జలాశయాలకు ఉద్ధృతంగా వరద
జంట జలాశయాలకు ఉద్ధృతంగా వరద

Twin Reservoirs : తెలంగాణలోని హైదరాబాద్​లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. రహదారులపైకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పనులపై బయటకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరంలోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్​సాగర్​కు వరద ప్రవాహం పోటెత్తింది. ఉస్మాన్​సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,787 అడుగుల మేర నీరు నిలిచింది. ఉస్మాన్​సాగర్ జలాశయానికి ప్రస్తుతం 1,200 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉంది.

హిమాయత్‌సాగర్ జలాశయంలోకి 325 క్యూసెక్కుల నీరు చేరుతోంది. హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,760.70 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.

మరోవైపు హుస్సేన్‌సాగర్​లోకీ భారీగా వరద నీరు చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయి దాటింది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లుగా ఉంది.

ఇవీ చూడండి.. 'సాహో సైనికా'.. కార్గిల్​ అమర వీరులకు ఘన నివాళి

Twin Reservoirs : తెలంగాణలోని హైదరాబాద్​లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. రహదారులపైకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పనులపై బయటకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరంలోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్​సాగర్​కు వరద ప్రవాహం పోటెత్తింది. ఉస్మాన్​సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,787 అడుగుల మేర నీరు నిలిచింది. ఉస్మాన్​సాగర్ జలాశయానికి ప్రస్తుతం 1,200 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉంది.

హిమాయత్‌సాగర్ జలాశయంలోకి 325 క్యూసెక్కుల నీరు చేరుతోంది. హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,760.70 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.

మరోవైపు హుస్సేన్‌సాగర్​లోకీ భారీగా వరద నీరు చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయి దాటింది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లుగా ఉంది.

ఇవీ చూడండి.. 'సాహో సైనికా'.. కార్గిల్​ అమర వీరులకు ఘన నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.