తమ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇస్తే... ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడినుంచి రాజధాని తరలిస్తోందని తుళ్లూరులో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటి సిఫార్సులు ఆమోదిస్తే.. తామంతా రోడ్డుపై పడతామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి తమ ఆవేదనను అర్థం చేసుకుని ఇక్కడే రాజధాని ఉంచాలని కోరారు.
ఇవీ చదవండి..