ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : Jun 10, 2021, 10:58 AM IST

Top News
ప్రధాన వార్తలు
  • Vishaka KGH: వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్‌.. ఏపీలో ఇదే ఫస్ట్ టైమ్!

విశాఖ కేజీహెచ్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. రాష్ట్రంలో.. వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి మొదటిసారిగా సిజేరియన్‌ చేశారు. సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 10 రోజులుగా వెంటిలేటర్‌పై బాధితురాలు చికిత్స అందుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • APPSC: ఏపీపీఎస్సీని వైకాపా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మార్చేశారు: లోకేశ్​

ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్స్ పరీక్షపై అభ్యర్థులతో లోకేశ్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఏపీపీఎస్సీలో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. డిజిటల్ మూల్యాంకనం సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖ తాగు నీటి నాణ్యతపై.. నివేదికలు సమర్పించండి: ఎన్జీటీ

విశాఖపట్నంలో సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతపై సమగ్ర వివరాలతో తాజా నివేదికలు సమర్పించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌.. విశాఖ మహానగర పాలక సంస్థ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఓ ఆంగ్ల పక్షపత్రికలో గత ఏడాది వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ.. ఈ విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • MSP: రైతుకు ఒరిగేది అరకొరే.. రాష్ట్రం లెక్కలను పరిగణనలోకి తీసుకోని కేంద్రం!

క్వింటాలు ధాన్యం పండించడానికే రూ.2,114 అవుతోందని ఆంధ్రప్రదేశ్‌ లెక్క కట్టింది. దీనికి 50% కలిపితే.. రూ.3,171 చొప్పున ప్రకటించాలి. కేంద్రం మాత్రం ఉత్పత్తి వ్యయం రూ.1,293గా లెక్కేసి.. దానికి 50% కలిపి రూ.1,940 చేసింది. అంటే క్వింటాలుకు రూ.1,231 తక్కువగా ఇచ్చారు. ఎకరాకు (22 క్వింటాళ్ల దిగుబడి) రూ.27,082 మొత్తాన్ని రైతులు కోల్పోతున్నారు. కానీ కేంద్రం మాత్రం గతేడాది కంటే క్వింటాలుకు రూ.72 పెంచామని ఘనంగా చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో బ్లాక్​(Black Fungus), వైట్​.. వంటి ఫంగస్​ ఇన్​ఫెక్షన్లు దాడి చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోజుకో కొత్త రంకం ఫంగస్​లు భయపడతున్నాయి. మరి ఈ వ్యాధికి వైద్య రంగంలో చికిత్స సాధ్యమేనా? వైద్యులు చెబుతున్నదేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మిత్రులతో ఆ పని చేయాలని భార్యను వేధించి...

సొంత భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు ఓ భర్త. తొలుత మద్యం తాగాలని ఒత్తిడి చేసి.. తర్వాత తన మిత్రులతో శృంగారంలో పాల్గొనాలని వేధించాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్​​ దాడులు

ఇరాక్​లో అమెరికా దళాలు ఉన్న రెండు సైనిక స్థావరాలపై వరుస రాకెట్​ దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే.. ఇంతవరకు ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Stock Market: స్వల్ప లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా బలపడి 52,073 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు పెరిగి 15,685 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • French open: సెమీస్​లో జకోవిచ్- నాదల్ ఢీ

ఫ్రెంచ్​ ఓపెన్​లో రసవత్తర మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. మూడో సీడ్​ రఫెల్​ నాదల్​తో టాప్​సీడ్​ నొవాక్​ జొకోవిచ్​ సెమీస్​లో తలపడనున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Sonu Sood: 'దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు'

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి తన వంతు సాయం చేస్తూ, మంచి మనసు చాటుకున్నారు సోనూసూద్. ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్​లో ఆక్సిజన్​ లేక చాలామంది మరణిస్తుండటం చూసి చలించిపోయిన ఆయన.. దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Vishaka KGH: వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్‌.. ఏపీలో ఇదే ఫస్ట్ టైమ్!

విశాఖ కేజీహెచ్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. రాష్ట్రంలో.. వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి మొదటిసారిగా సిజేరియన్‌ చేశారు. సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 10 రోజులుగా వెంటిలేటర్‌పై బాధితురాలు చికిత్స అందుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • APPSC: ఏపీపీఎస్సీని వైకాపా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మార్చేశారు: లోకేశ్​

ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్స్ పరీక్షపై అభ్యర్థులతో లోకేశ్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఏపీపీఎస్సీలో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. డిజిటల్ మూల్యాంకనం సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖ తాగు నీటి నాణ్యతపై.. నివేదికలు సమర్పించండి: ఎన్జీటీ

విశాఖపట్నంలో సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతపై సమగ్ర వివరాలతో తాజా నివేదికలు సమర్పించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌.. విశాఖ మహానగర పాలక సంస్థ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఓ ఆంగ్ల పక్షపత్రికలో గత ఏడాది వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ.. ఈ విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • MSP: రైతుకు ఒరిగేది అరకొరే.. రాష్ట్రం లెక్కలను పరిగణనలోకి తీసుకోని కేంద్రం!

క్వింటాలు ధాన్యం పండించడానికే రూ.2,114 అవుతోందని ఆంధ్రప్రదేశ్‌ లెక్క కట్టింది. దీనికి 50% కలిపితే.. రూ.3,171 చొప్పున ప్రకటించాలి. కేంద్రం మాత్రం ఉత్పత్తి వ్యయం రూ.1,293గా లెక్కేసి.. దానికి 50% కలిపి రూ.1,940 చేసింది. అంటే క్వింటాలుకు రూ.1,231 తక్కువగా ఇచ్చారు. ఎకరాకు (22 క్వింటాళ్ల దిగుబడి) రూ.27,082 మొత్తాన్ని రైతులు కోల్పోతున్నారు. కానీ కేంద్రం మాత్రం గతేడాది కంటే క్వింటాలుకు రూ.72 పెంచామని ఘనంగా చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో బ్లాక్​(Black Fungus), వైట్​.. వంటి ఫంగస్​ ఇన్​ఫెక్షన్లు దాడి చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోజుకో కొత్త రంకం ఫంగస్​లు భయపడతున్నాయి. మరి ఈ వ్యాధికి వైద్య రంగంలో చికిత్స సాధ్యమేనా? వైద్యులు చెబుతున్నదేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మిత్రులతో ఆ పని చేయాలని భార్యను వేధించి...

సొంత భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు ఓ భర్త. తొలుత మద్యం తాగాలని ఒత్తిడి చేసి.. తర్వాత తన మిత్రులతో శృంగారంలో పాల్గొనాలని వేధించాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్​​ దాడులు

ఇరాక్​లో అమెరికా దళాలు ఉన్న రెండు సైనిక స్థావరాలపై వరుస రాకెట్​ దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే.. ఇంతవరకు ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Stock Market: స్వల్ప లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా బలపడి 52,073 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు పెరిగి 15,685 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • French open: సెమీస్​లో జకోవిచ్- నాదల్ ఢీ

ఫ్రెంచ్​ ఓపెన్​లో రసవత్తర మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. మూడో సీడ్​ రఫెల్​ నాదల్​తో టాప్​సీడ్​ నొవాక్​ జొకోవిచ్​ సెమీస్​లో తలపడనున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Sonu Sood: 'దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు'

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి తన వంతు సాయం చేస్తూ, మంచి మనసు చాటుకున్నారు సోనూసూద్. ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్​లో ఆక్సిజన్​ లేక చాలామంది మరణిస్తుండటం చూసి చలించిపోయిన ఆయన.. దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.