ETV Bharat / city

రాజధాని గ్రామాల్లో భారీగా సాయుధ దళాల మోహరింపు

author img

By

Published : Jan 20, 2020, 5:02 AM IST

రాజధాని అంశమే ప్రధాన అజెండాగా నేడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అమరావతి గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 33 రోజుల పాటు వివిధ రకాలుగా తమ నిరసన తెలియజేసిన  ఆ ప్రాంత ప్రజలు....ఇవాళ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా  భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.  అమరావతిపై సానుకూల ప్రకటన వచ్చేవరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతున్నారు.

the-deployment-of-heavily-armed-troops-in-capital-villages-amaravathi
the-deployment-of-heavily-armed-troops-in-capital-villages-amaravathi


అమరావతిలో ఆందోళనలు ఏమాత్రం తగ్గలేదు. 34వ రోజు రైతులు, మహిళలు తమ నిరనస తెలియజేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. రాజధాని ఘోషతో ఇప్పటికే ఎంతోమంది చనిపోగా....మరో మహిళ తనువు చాలించింది. మూడు రోజుల కిందట రైతుల దీక్షలో పాల్గొన్న వేదవతి... శిబిరంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందారు. నేలపాడులో రైతుల నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం రాజధాని తరలించేందుకే నిర్ణయిస్తే ప్రాణత్యాగాలకు వెనకాడబోమంటూ రైతులు, ఉద్యోగస్థుల భవనాల పైకి ఎక్కారు. వారి కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. రైతులకు గ్రామస్థులు నచ్చజెప్పడంతో... కొద్దిసేపటి తర్వాత కిందకు దిగారు.

రాజధాని గ్రామాల్లో భారీగా సాయుధ దళాల మోహరింపు

చలో అసెంబ్లీకి సిద్ధం..!
రాజధాని రైతులపై ప్రభుత్వ అణచివేత చర్యలు నియంతృత్వ పోకడలను ప్రతిబింబిస్తున్నాయని... తెలుగుదేశం నేత పరిటాల శ్రీరాం అన్నారు. రైతుల నిరసనలకు ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని ఉద్యమానికి సంపూర్ణ మద్దతివ్వాలని.... అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో బెజవాడ బార్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇవాళ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.

'మన రాజధాని మన అమరావతి' అనే నినాదంతో... గుంటూరు జిల్లా తెనాలిలో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. తెలుగుదేశం నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ ప్రజాభిప్రాయం సేకరించారు. తుళ్లూరు సహా చిలకలూరిపేట మండలం పసుమర్రులో.... సేవ్ అమరావతి అంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో మహిళలు నల్ల చీరలు ధరించి, రిబ్బన్లతో చేతులకు సంకెళ్ళు వేసుకుని నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి : రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధం


అమరావతిలో ఆందోళనలు ఏమాత్రం తగ్గలేదు. 34వ రోజు రైతులు, మహిళలు తమ నిరనస తెలియజేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. రాజధాని ఘోషతో ఇప్పటికే ఎంతోమంది చనిపోగా....మరో మహిళ తనువు చాలించింది. మూడు రోజుల కిందట రైతుల దీక్షలో పాల్గొన్న వేదవతి... శిబిరంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందారు. నేలపాడులో రైతుల నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం రాజధాని తరలించేందుకే నిర్ణయిస్తే ప్రాణత్యాగాలకు వెనకాడబోమంటూ రైతులు, ఉద్యోగస్థుల భవనాల పైకి ఎక్కారు. వారి కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. రైతులకు గ్రామస్థులు నచ్చజెప్పడంతో... కొద్దిసేపటి తర్వాత కిందకు దిగారు.

రాజధాని గ్రామాల్లో భారీగా సాయుధ దళాల మోహరింపు

చలో అసెంబ్లీకి సిద్ధం..!
రాజధాని రైతులపై ప్రభుత్వ అణచివేత చర్యలు నియంతృత్వ పోకడలను ప్రతిబింబిస్తున్నాయని... తెలుగుదేశం నేత పరిటాల శ్రీరాం అన్నారు. రైతుల నిరసనలకు ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని ఉద్యమానికి సంపూర్ణ మద్దతివ్వాలని.... అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో బెజవాడ బార్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇవాళ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.

'మన రాజధాని మన అమరావతి' అనే నినాదంతో... గుంటూరు జిల్లా తెనాలిలో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. తెలుగుదేశం నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ ప్రజాభిప్రాయం సేకరించారు. తుళ్లూరు సహా చిలకలూరిపేట మండలం పసుమర్రులో.... సేవ్ అమరావతి అంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో మహిళలు నల్ల చీరలు ధరించి, రిబ్బన్లతో చేతులకు సంకెళ్ళు వేసుకుని నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి : రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.