ETV Bharat / city

'బిల్లులు సెలక్ట్​ కమిటీకి వెళ్లాక మళ్లీ ఎలా పెడతారు..?'

author img

By

Published : Jun 17, 2020, 3:44 AM IST

రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసేలా బడ్జెట్​ ఉందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్టీఏ రద్దు బిల్లులు సెలక్ట్​ కమిటీకి వెళ్లిన తర్వాత మళ్లీ అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను మాస్కు లేకుండా హాజరై ప్రజలకు ఏం సందేశం ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

'సెలక్ట్​ కమిటీకి వెళ్లాక మళ్లీ ఎలా పెడతారు..?'
'సెలక్ట్​ కమిటీకి వెళ్లాక మళ్లీ ఎలా పెడతారు..?'

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలిలో ఒకసారి సెలక్ట్‌ కమిటీకి వెళ్లాక... మళ్లీ అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అది రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన.. బిల్లులపై స్పష్టత వచ్చేంతవరకు ముందుకు వెళ్లబోమని అడ్వకేట్​ జనరల్​ హైకోర్టుకు చెప్పారన్నారు. బిల్లులపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని.. శాసన మండలిలోనూ తమ సభ్యులు పోరాడతారని స్పష్టం చేశారు. బడ్జెట్​ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు.

ఇదే నా మీ గొప్ప..?

ప్రభుత్వాన్ని ఆర్థికమంత్రి పొగడ్తలతో ముంచెత్తినా...లెక్కల్లో పొంతనేదని చంద్రబాబు ప్రశ్నించారు. అది చేశాం.. ఇది చేశామని చెప్పుకుంటున్న సర్కారు... సంవత్సర కాలంలో అప్పులే తెచ్చింది తప్ప... ఆదాయ మార్గాలు అన్వేషించలేదన్నారు. 2018-19లో మూలధన వ్యయం రూ.19,976 కోట్లు ఉంటే.. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.12,845 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక.. అప్పులు 3.02 లక్షల కోట్లకు పెరిగాయని.. వచ్చే ఏడాది రూ.3.50 లక్షల కోట్లకు చేరుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. 2018-19లో రాష్ట్ర ఆదాయం రూ.1,14,670 కోట్లు కాగా.. 2019-20లో రాష్ట్ర ఆదాయం రూ.1,10,800 కోట్లని మండిపడ్డారు.

దేవుడు స్క్రిప్ట్​ రాస్తూనే ఉన్నాడు

దేవుడు స్క్రిప్ట్​ రాస్తూనే ఉన్నాడని.. వైకాపా చేసే అక్రమాలన్నీ లెక్కపెడుతున్నాడని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిన అంశాన్ని గవర్నర్​ ప్రసంగంలో చేర్చకపోవడం ప్రభుత్వం పిరికితనానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు.

ఏం సందేశమిస్తారు

కరోనా వైరస్​ నివారణ పట్ల శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది మాస్కులు లేకుండా శాసనసభకు వచ్చారని మండిపడ్డారు. దీని ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో ఆలోచించుకోవాలని అన్నారు.

ఇదీ చూడండి..

వ్యవ'సాయ'మే ప్రాధాన్యం... రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం !

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలిలో ఒకసారి సెలక్ట్‌ కమిటీకి వెళ్లాక... మళ్లీ అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అది రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన.. బిల్లులపై స్పష్టత వచ్చేంతవరకు ముందుకు వెళ్లబోమని అడ్వకేట్​ జనరల్​ హైకోర్టుకు చెప్పారన్నారు. బిల్లులపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని.. శాసన మండలిలోనూ తమ సభ్యులు పోరాడతారని స్పష్టం చేశారు. బడ్జెట్​ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు.

ఇదే నా మీ గొప్ప..?

ప్రభుత్వాన్ని ఆర్థికమంత్రి పొగడ్తలతో ముంచెత్తినా...లెక్కల్లో పొంతనేదని చంద్రబాబు ప్రశ్నించారు. అది చేశాం.. ఇది చేశామని చెప్పుకుంటున్న సర్కారు... సంవత్సర కాలంలో అప్పులే తెచ్చింది తప్ప... ఆదాయ మార్గాలు అన్వేషించలేదన్నారు. 2018-19లో మూలధన వ్యయం రూ.19,976 కోట్లు ఉంటే.. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.12,845 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక.. అప్పులు 3.02 లక్షల కోట్లకు పెరిగాయని.. వచ్చే ఏడాది రూ.3.50 లక్షల కోట్లకు చేరుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. 2018-19లో రాష్ట్ర ఆదాయం రూ.1,14,670 కోట్లు కాగా.. 2019-20లో రాష్ట్ర ఆదాయం రూ.1,10,800 కోట్లని మండిపడ్డారు.

దేవుడు స్క్రిప్ట్​ రాస్తూనే ఉన్నాడు

దేవుడు స్క్రిప్ట్​ రాస్తూనే ఉన్నాడని.. వైకాపా చేసే అక్రమాలన్నీ లెక్కపెడుతున్నాడని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిన అంశాన్ని గవర్నర్​ ప్రసంగంలో చేర్చకపోవడం ప్రభుత్వం పిరికితనానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు.

ఏం సందేశమిస్తారు

కరోనా వైరస్​ నివారణ పట్ల శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది మాస్కులు లేకుండా శాసనసభకు వచ్చారని మండిపడ్డారు. దీని ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో ఆలోచించుకోవాలని అన్నారు.

ఇదీ చూడండి..

వ్యవ'సాయ'మే ప్రాధాన్యం... రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.