ETV Bharat / city

ప్రధానితో భేటీ విషయాలు బయటపెట్టాలి: కనకమేడల

author img

By

Published : Oct 8, 2020, 11:37 PM IST

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ... రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు...స్వప్రయోజనాల కోసమని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. ప్రజలకు చెప్పకుండా దాచే విషయాలు చర్చించారా అని పశ్నించారు. ప్రధానితో సమావేశంపై జగన్ మౌనం, వైకాపా నేతల అతి ప్రవర్తన అనుమానాలకు తావిస్తుందన్నారు. భేటీ విషయాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

కనకమేడల
కనకమేడల

ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన సమావేశంపై సీఎం జగన్ మొహం చాటేయడం గర్హనీయమని తెదేపా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు.

"ప్రజలకు చెప్పకుండా దాచాల్సిన విషయాలు ఏమున్నాయి. చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని కొందరు వైకాపా నేతలు చెప్పటం విడ్డూరం. ఏకాంతంగా జరిగిన చర్చ వివరాలు వారికెలా తెలిశాయి. అక్కడి బల్ల కింద దాక్కుని విన్నారా. కేవలం తనపై ఉన్న కేసుల కోసమే సీఎం పదే పదే దిల్లీ వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. జగన్ మౌనం, వైకాపా నేతల అతి ప్రవర్తన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది." అని విమర్శించారు. ప్రధానితో జరిగిన సమావేశం వివరాలు బయటపెట్టాలని కనకమేడల డిమాండ్ చేశారు.

ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన సమావేశంపై సీఎం జగన్ మొహం చాటేయడం గర్హనీయమని తెదేపా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు.

"ప్రజలకు చెప్పకుండా దాచాల్సిన విషయాలు ఏమున్నాయి. చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని కొందరు వైకాపా నేతలు చెప్పటం విడ్డూరం. ఏకాంతంగా జరిగిన చర్చ వివరాలు వారికెలా తెలిశాయి. అక్కడి బల్ల కింద దాక్కుని విన్నారా. కేవలం తనపై ఉన్న కేసుల కోసమే సీఎం పదే పదే దిల్లీ వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. జగన్ మౌనం, వైకాపా నేతల అతి ప్రవర్తన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది." అని విమర్శించారు. ప్రధానితో జరిగిన సమావేశం వివరాలు బయటపెట్టాలని కనకమేడల డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

పెట్రోల్​ ట్యాంకర్​లో గంజాయి రవాణా... డ్రైవర్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.