ETV Bharat / city

'ప్రజలకు రక్షణ లేకుండా పోయింది... స్పందించండి' - AP Government

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తెదేపా నేతలు... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేస్తూ... అక్రమ కేసులు పెడుతున్నారని వివరించారు. ఈ పరిణామాలపై విచారణ జరిపాలని విజ్ఞప్తి చేశారు.

కిషన్​రెడ్డిని కలిసిన తెదేపా నేతలు
author img

By

Published : Sep 18, 2019, 12:03 AM IST

కిషన్​రెడ్డిని కలిసిన తెదేపా నేతలు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్​లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే గిరిధర్‌, మాజీ ఎమ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్‌, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌ రమణ, సినీయర్‌ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి వినతి పత్రం అందజేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి క్షీణించాయని, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని నేతలు అవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని కిషన్​రెడ్డిని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో మాట్లాడి దర్యాప్తు చేయిస్తామని కిషన్‌రెడ్డి తెదేపా నేతలకు హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయన్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు మరణించడం చాలా బాధకరమన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను చేతిలోకి తీసుకోకూడదని... కోడెల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్‌, రాష్ట్ర డిజీపీతోనూ మాట్లాడతానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండీ... వైకాపా కుట్రలపై పోరాటం చేస్తా: చంద్రబాబు

కిషన్​రెడ్డిని కలిసిన తెదేపా నేతలు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్​లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే గిరిధర్‌, మాజీ ఎమ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్‌, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌ రమణ, సినీయర్‌ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి వినతి పత్రం అందజేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి క్షీణించాయని, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని నేతలు అవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని కిషన్​రెడ్డిని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో మాట్లాడి దర్యాప్తు చేయిస్తామని కిషన్‌రెడ్డి తెదేపా నేతలకు హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయన్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు మరణించడం చాలా బాధకరమన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను చేతిలోకి తీసుకోకూడదని... కోడెల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్‌, రాష్ట్ర డిజీపీతోనూ మాట్లాడతానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండీ... వైకాపా కుట్రలపై పోరాటం చేస్తా: చంద్రబాబు

Intro:AP_RJY_86_17_Road_Accident_AV_AP10023
ETV Bharat:Satyanarayana (RJY City)

Rajamahendravaram.

( ) తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం లో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో నీ మొఖం చిత్రమై కావడంతో అతను ఎవరో గుర్తు పట్టడానికి వీలు లేకుండా పోయింది .మోటార్ బైక్ పై రాజమహేంద్రవరం వైపు నుంచి రాజనగరం వైపు వెళ్తుండగా హైవే రహదారి కటింగ్ వద్ద పైకి స్కిడై జారీ పడినట్లు ఆ వెనుకనే లారీ ఢీ కొట్టి తలమీద నుంచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బొమ్మూరు ఎస్సై ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.బైకు ఉన్న సంచిలో రాజమహేంద్రవరం లోని ఒక బట్టల దుకాణంలో సుమారు మూడు వేల రూపాయలు విలువచేసే నూతన వస్త్రాలను కొనుగోలు చేసినట్లుగా బట్టల బిల్లు ఉన్నాయి. సదురు బట్టల దుకాణం వారికి ఎస్ ఐ జగన్ మోహన్ రావు చరవాణి లో సంప్రదించగా జగ్గంపేట వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.Body:AP_RJY_86_17_Road_Accident_AV_AP10023Conclusion:AP_RJY_86_17_Road_Accident_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.