ETV Bharat / city

'ప్రభుత్వ వైఫల్యాలను మరిచిపోయేందుకు అమరావతి భూములపై ఆరోపణలు'

author img

By

Published : Sep 15, 2020, 6:41 PM IST

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అమరావతి భూములపై ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపాపై రాజకీయ కక్షతోనే అమరావతిపై వైకాపా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. పదేపదే అబద్ధాలు చెప్పి వాటినే నిజాలుగా ప్రజల్లో అపోహలు సృష్టించాలని వైకాపా నాయకులు అనేక ప్రయత్నాలు చేశారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు చేసిన భూములపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.

tdp leaders fires on ysrcp govt over amaravathi inside trading
tdp leaders fires on ysrcp govt over amaravathi inside trading

రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అధికార పార్టీ ఆరోపణలపై తెలుగుదేశం ఎదురుదాడికి దిగింది. ఉన్మాదుల భజన చేయకపోతే ఉసురు తీస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులను ఆపేసి, అరాచకాలను ప్రోత్సహించడమే పనిగా వైకాపా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లకు కలిగే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని చెప్పారు.

ప్రజల దృష్టిని మళ్లించడానికే...

ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని పాలకులు తెరపైకి తెచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. తెదేపాపై బురదజల్లే కార్యక్రమాలు తప్ప, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదన్నారు. సీఆర్డీఏ హద్దులకు ఆవల ఉన్న ప్రాంతాల్లోని భూములను కూడా రాజధాని భూములని విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించే ధైర్యం జగన్​కు ఉందా అని ప్రశ్నించారు.

జగన్​ పేరు పెట్టడం మరిచిపోయినట్టున్నారు...

ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో జగన్మోహన్​ రెడ్డి పేరు పెట్టడం ఏసీబీ మర్చిపోయినట్టుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. అమరావతిలో జగన్ ఇళ్లు కట్టింది కూడా అమరావతి ప్రకటన తరువాతే కదా అని ప్రశ్నించారు. ప్రకటన వచ్చిన తరువాత కొన్నవి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే జగన్ రెడ్డి కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడినట్టేనని ఆయన స్పష్టం చేశారు.

16 నెలల్లో ఒక్క ఆధారం చూపలేదు...

దళితులపై దమనకాండ, దేవాలయాలపై దాడుల ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మరోసారి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వైకాపా పాతపాట పాడుతోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. అమరావతిపై ఎన్నో విమర్శలు చేశారని.. 16 నెలల్లో ఒక్క ఆధారం చూపించలేదని ధ్వజమెత్తారు. గనుల దొంగ అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ కార్యకర్తలే కేసులు వేస్తున్నారని.. మండిపడ్డారు. అధికార పార్టీ నేతల విమర్శలపై తెదేపా అధికార ప్రతినిధి బోండా ఉమా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణం ప్రాజెక్టులు పూర్తి చేయాలి..

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా వచ్చాక నిలిచిపోయిన ప్రాజెక్టులను చూస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆత్మ ఘోషిస్తుందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎందుకంటే కక్షతో ప్రాజెక్టులు నిలిపేసి ఇంజినీర్లు, కార్మికుల ఉపాధి పోగొట్టడం ఇంజినీరింగ్ ద్రోహమని మండిపడ్డారు. ఇప్పటికైనా పాలకులు తెలుగుదేశం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, పేదల ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, సైబర్ సిటీ నిర్మాణాల నుంచి ఏపీలోని అమరావతి గ్రీన్ ఫీల్డ్ కాపిటల్ సిటీ, నదుల అనుసంధాన ప్రాజెక్టు.. లాంటివి తెదేపా హయాంలో ఎన్నో నిర్మాణాలు జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇదీ చదవండి: 13 నెలల్లో స్వరాజ్ మైదానంలో పనులు పూర్తి చేయాలి: సీఎం

రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అధికార పార్టీ ఆరోపణలపై తెలుగుదేశం ఎదురుదాడికి దిగింది. ఉన్మాదుల భజన చేయకపోతే ఉసురు తీస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులను ఆపేసి, అరాచకాలను ప్రోత్సహించడమే పనిగా వైకాపా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లకు కలిగే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని చెప్పారు.

ప్రజల దృష్టిని మళ్లించడానికే...

ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని పాలకులు తెరపైకి తెచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. తెదేపాపై బురదజల్లే కార్యక్రమాలు తప్ప, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదన్నారు. సీఆర్డీఏ హద్దులకు ఆవల ఉన్న ప్రాంతాల్లోని భూములను కూడా రాజధాని భూములని విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించే ధైర్యం జగన్​కు ఉందా అని ప్రశ్నించారు.

జగన్​ పేరు పెట్టడం మరిచిపోయినట్టున్నారు...

ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో జగన్మోహన్​ రెడ్డి పేరు పెట్టడం ఏసీబీ మర్చిపోయినట్టుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. అమరావతిలో జగన్ ఇళ్లు కట్టింది కూడా అమరావతి ప్రకటన తరువాతే కదా అని ప్రశ్నించారు. ప్రకటన వచ్చిన తరువాత కొన్నవి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే జగన్ రెడ్డి కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడినట్టేనని ఆయన స్పష్టం చేశారు.

16 నెలల్లో ఒక్క ఆధారం చూపలేదు...

దళితులపై దమనకాండ, దేవాలయాలపై దాడుల ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మరోసారి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వైకాపా పాతపాట పాడుతోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. అమరావతిపై ఎన్నో విమర్శలు చేశారని.. 16 నెలల్లో ఒక్క ఆధారం చూపించలేదని ధ్వజమెత్తారు. గనుల దొంగ అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ కార్యకర్తలే కేసులు వేస్తున్నారని.. మండిపడ్డారు. అధికార పార్టీ నేతల విమర్శలపై తెదేపా అధికార ప్రతినిధి బోండా ఉమా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణం ప్రాజెక్టులు పూర్తి చేయాలి..

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా వచ్చాక నిలిచిపోయిన ప్రాజెక్టులను చూస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆత్మ ఘోషిస్తుందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎందుకంటే కక్షతో ప్రాజెక్టులు నిలిపేసి ఇంజినీర్లు, కార్మికుల ఉపాధి పోగొట్టడం ఇంజినీరింగ్ ద్రోహమని మండిపడ్డారు. ఇప్పటికైనా పాలకులు తెలుగుదేశం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, పేదల ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, సైబర్ సిటీ నిర్మాణాల నుంచి ఏపీలోని అమరావతి గ్రీన్ ఫీల్డ్ కాపిటల్ సిటీ, నదుల అనుసంధాన ప్రాజెక్టు.. లాంటివి తెదేపా హయాంలో ఎన్నో నిర్మాణాలు జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇదీ చదవండి: 13 నెలల్లో స్వరాజ్ మైదానంలో పనులు పూర్తి చేయాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.