ETV Bharat / city

తెలుగు పద్మపురస్కార గ్రహీతలకు.. లోకేశ్​ అభినందనలు - పద్మపురస్కార వార్తలు

కేెంద్రం ప్రకటించిన పద్మపురస్కారాల్లోని తెలుగు ప్రముఖులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అభినందనలు తెలియజేశారు. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్‌ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

nara lokesh on padma awardees
తెలుగు పద్మపురస్కార గ్రహీతలకు లోకేశ్​ అభినందనలు
author img

By

Published : Jan 26, 2021, 4:10 PM IST

అద్భుత గానప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్‌ అవార్డు రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ఈ వార్త విన్న ప్రతి తెలుగు హృదయం గర్విస్తోందన్నారు.

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు ప్రముఖులందరికి లోకేశ్​ అభినందనలు తెలిపారు. ఏపీకి చెందిన వయోలిన్ కళాకారులు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి, సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావులకు అభినందనలు తెలిపారు. తెలంగాణకు చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు అభినందనలు తెలియజేశారు.

అద్భుత గానప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్‌ అవార్డు రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ఈ వార్త విన్న ప్రతి తెలుగు హృదయం గర్విస్తోందన్నారు.

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు ప్రముఖులందరికి లోకేశ్​ అభినందనలు తెలిపారు. ఏపీకి చెందిన వయోలిన్ కళాకారులు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి, సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావులకు అభినందనలు తెలిపారు. తెలంగాణకు చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు అభినందనలు తెలియజేశారు.

ఇదీ చదవండి: 'ఐదుగురు తెలుగువారికి 'పద్మ' అవార్డులు రావడం గర్వకారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.