ETV Bharat / city

వైకాపా విధ్వంసకర పాలనకు ఏడాది : తెదేపా

author img

By

Published : May 30, 2020, 10:26 AM IST

వైకాపా ఏడాది పాలనపై తెదేపా ఘాటైన విమర్శలు చేసింది. రాష్ట్రంలో విధ్వంసకరపాలన జరుగుతోందని ఆరోపించింది. భూములిచ్చిన రైతులపై లాఠీ ఝళిపించిన ప్రభుత్వమని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించగా.... అన్న క్యాంటీన్లు మూసేసి పేదవాడి కడుపు కొట్టారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు.

చంద్రబాబు
చంద్రబాబు
చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

భూములు ఇచ్చిన రైతులు లాఠీ దెబ్బలు తిన్న ఘటన దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై ఆయన ట్విట్టర్​లో స్పందించారు. రాజధాని అమరావతి రైతుల పట్ల పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోను చంద్రబాబు.. తన సందేశానికి జత చేశారు.

లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్

రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. బడుగుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మూసేవేసి,పేదవాడి కడుపు కొట్టారని ఆక్షేపించారు.

అన్నయ్యపాత్రుడు ట్వీట్
అన్నయ్యపాత్రుడు ట్వీట్

"మాట తప్పుడు, మడమ తిప్పుడు వంశానికి సీఎం జగన్ వారసుడు" అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఏడాది పాలనలో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వెయ్యడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేత నుంచి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని కల్లోలం సృష్టించారన్నారు.

దేవినేని ఉమా ట్వీట్
దేవినేని ఉమా ట్వీట్

ముఖ్యమంత్రి జగన్‌ చెప్తున్న ఆరోగ్యశ్రీ మాటలకే పరిమితమైందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మైలవరంలో నడిరోడ్డుపై మహిళ ప్రసవవేదన పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విశాఖ మెడ్​టెక్ జోన్ జగన్‌ నిర్లక్ష్య వైఖరికి బలయ్యిందని ఆరోపించారు. 12 నెలల్లో వైద్యరంగంలో ఎంత ఖర్చుపెట్టారో, ఎన్నిఉద్యోగాలు ఇచ్చారో.. ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అని ఉమా సవాల్‌ విసిరారు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ రమేశ్‌ విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

భూములు ఇచ్చిన రైతులు లాఠీ దెబ్బలు తిన్న ఘటన దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై ఆయన ట్విట్టర్​లో స్పందించారు. రాజధాని అమరావతి రైతుల పట్ల పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోను చంద్రబాబు.. తన సందేశానికి జత చేశారు.

లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్

రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. బడుగుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మూసేవేసి,పేదవాడి కడుపు కొట్టారని ఆక్షేపించారు.

అన్నయ్యపాత్రుడు ట్వీట్
అన్నయ్యపాత్రుడు ట్వీట్

"మాట తప్పుడు, మడమ తిప్పుడు వంశానికి సీఎం జగన్ వారసుడు" అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఏడాది పాలనలో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వెయ్యడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేత నుంచి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని కల్లోలం సృష్టించారన్నారు.

దేవినేని ఉమా ట్వీట్
దేవినేని ఉమా ట్వీట్

ముఖ్యమంత్రి జగన్‌ చెప్తున్న ఆరోగ్యశ్రీ మాటలకే పరిమితమైందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మైలవరంలో నడిరోడ్డుపై మహిళ ప్రసవవేదన పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విశాఖ మెడ్​టెక్ జోన్ జగన్‌ నిర్లక్ష్య వైఖరికి బలయ్యిందని ఆరోపించారు. 12 నెలల్లో వైద్యరంగంలో ఎంత ఖర్చుపెట్టారో, ఎన్నిఉద్యోగాలు ఇచ్చారో.. ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అని ఉమా సవాల్‌ విసిరారు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ రమేశ్‌ విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.