ETV Bharat / city

ఇందిరాభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశం - ఏపీపీసీసీ కమిటీ సమావేశం తాజా వార్తలు

హైదరాబాద్​లోని ఇందిరాభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయటం.. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇందిరాభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశం
ఇందిరాభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశం
author img

By

Published : Jan 5, 2021, 1:58 PM IST

రాష్ట్ర కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశం హైదరాబాద్​లోని ఇందిరాభవన్‌లో జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్‌ చాందీ, ఏపీపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌, కార్యనిర్వహక అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌ తులసి రెడ్డిలతోపాటు పలువురు కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ వైఖరిపై ప్రధానంగా చర్చించి ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి పంథా అనుసరించాలి, అందుకోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలను చర్చించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఎవరిని భాగస్వామ్యం చేయాలి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

రాష్ట్ర కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశం హైదరాబాద్​లోని ఇందిరాభవన్‌లో జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్‌ చాందీ, ఏపీపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌, కార్యనిర్వహక అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌ తులసి రెడ్డిలతోపాటు పలువురు కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ వైఖరిపై ప్రధానంగా చర్చించి ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి పంథా అనుసరించాలి, అందుకోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలను చర్చించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఎవరిని భాగస్వామ్యం చేయాలి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

'కులమతాల మాటున విధ్వంస రాజకీయాలు తగదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.