ఈనెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదోతరగతి పరీక్షలను వాయిదా వేశారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కొత్త షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ , ఏప్రిల్ 4న ఇంగ్లిష్ పేపర్-1, ఏప్రిల్ 6న ఇంగ్లిష్ పేపర్-2 నిర్వహించనున్నారు. అదే విధంగా ఏప్రిల్ 7న గణితం పేపర్ -1, ఏప్రిల్ 8న గణితం పేపర్-2, ఏప్రిల్ 9న సైన్స్ పేపర్-1, ఏప్రిల్ 11న సైన్స్ పేపర్-2, ఏప్రిల్ 13న సోషల్ పేపర్-1, ఏప్రిల్ 15న సోషల్ పేపర్-2 నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి...అతను నాన్న కాదు.. 'ఉత్తమ అమ్మ'