ETV Bharat / city

ఆస్తి కోసం చంపేశారు... 6 నెలల తర్వాత అరెస్టయ్యారు

author img

By

Published : Oct 31, 2019, 12:05 AM IST

కన్న తండ్రి తన పేరు మీద ఆస్తి రాసివ్వట్లేదన్న కోపంతో... క్రూరంగా ఆలోచించాడు ఓ కొడుకు. భార్యతో కలిసి బతికుండగానే నిప్పంటించాడు. కాపాడుతున్నట్టు నటించారు. చివరికి కటకటాలపాలయ్యారు.

ఆస్తి రాసివ్వలేదన్న కోపంతో కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు

ఆస్తి కోసం కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు..

మేడ్చల్ జిల్లా శామీర్​పేట్ మండలం పొన్నాలలో మేలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బాలనర్సింహ అనే వృద్ధుడు మే 4న అగ్నిప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 6 న మరణించాడు. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అసలు నిజం తెలిసింది. తమకు ఆస్తి ఇవ్వటం లేదన్న కోపంతో కొడుకు నర్సింహ, కోడలు జాంగిరమ్మ ఓ పథకం పన్నారు.

భయపడి ఉన్నదంతా చెప్పుకున్నారు...

మే నాలుగో తేదీ రాత్రి సమయంలో బాలనర్సింహ ఇంటి బయట పడుకోగా... దంపతులిద్దరూ కూడబలుక్కొని వృద్ధునిపై కిరోసిన్​పోసి నిప్పంటించారు. బాలనర్సింహ కేకలు వేయగా... మంటలు ఆర్పుతున్నట్లు నటించి, స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు 6న మరణించాడు. ఆస్పత్రిలో బాలనర్సింహ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 6 నెలలుగా సాగుతున్న విచారణకు భయపడిన నిందితులు గ్రామ పెద్దల వద్ద ఉన్నదంతా చెప్పుకున్నారు. కొడుకుకోడలే హత్య చేశారని నిర్ధరించుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఇవీచూడండి: ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం

ఆస్తి కోసం కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు..

మేడ్చల్ జిల్లా శామీర్​పేట్ మండలం పొన్నాలలో మేలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బాలనర్సింహ అనే వృద్ధుడు మే 4న అగ్నిప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 6 న మరణించాడు. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అసలు నిజం తెలిసింది. తమకు ఆస్తి ఇవ్వటం లేదన్న కోపంతో కొడుకు నర్సింహ, కోడలు జాంగిరమ్మ ఓ పథకం పన్నారు.

భయపడి ఉన్నదంతా చెప్పుకున్నారు...

మే నాలుగో తేదీ రాత్రి సమయంలో బాలనర్సింహ ఇంటి బయట పడుకోగా... దంపతులిద్దరూ కూడబలుక్కొని వృద్ధునిపై కిరోసిన్​పోసి నిప్పంటించారు. బాలనర్సింహ కేకలు వేయగా... మంటలు ఆర్పుతున్నట్లు నటించి, స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు 6న మరణించాడు. ఆస్పత్రిలో బాలనర్సింహ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 6 నెలలుగా సాగుతున్న విచారణకు భయపడిన నిందితులు గ్రామ పెద్దల వద్ద ఉన్నదంతా చెప్పుకున్నారు. కొడుకుకోడలే హత్య చేశారని నిర్ధరించుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఇవీచూడండి: ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం

Intro:TG_HYD_46_30_SHAMIRPET_MURDER_PRESSMEET_AB_TS10016Body:మేడ్చల్ జిల్లా షామీర్ పెట్ మండలం పొన్నాల గ్రామంలో దారుణం... ఆస్తి కోసం కన్న తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కొడుకు కోడలు..పేట్ బషీరాబాద్ ఏసిపి నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం షామీర్ పేట్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన బాల నర్సింహా 4.5.2019 నాడు తన కొడుకు కొడలైన నర్సింహా జాంగిరమ్మలు కలిసి బాల నర్సింహ పడుకున్నది చూసి కిరోసిన్ పోసి నిప్పు అంటించారని ఆ సమయంలో బాలనర్సింహ భరించలేక కేకలు వేయడంతో చుట్టూ పక్కల వాళ్ళు అరుపులు విని రావడంతో తన కొడుకు కోడలు నిప్పును ఆర్పీ అంబులెన్స్ కు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం బాలనర్సింహను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలనర్సింహ మృతి చెందాడు..బాలనర్సింహ ఇఛ్చిన వాంగ్మూలం ప్రకారం ఆయన కొడుకు మరియు కొడలు హత్య చేశారని నిర్దారణ కావడంతో పోలీసులు నిందితులను 6 నెలల తర్వాత అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండుకు తరలించారు. Conclusion:బైట్ : నరసింహారావు, ఏసీపీ, పేట్ బషీరాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.