ETV Bharat / city

'అమరావతిలో 144 సెక్షన్ అమలు చేస్తూ పౌరహక్కులు హరిస్తున్నారు'

author img

By

Published : Feb 4, 2020, 11:15 PM IST

అమరావతి రైతుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని లోక్​సభలో ఎంపీ కేశినాని నాని వ్యాఖ్యానించారు. 144 సెక్షన్ అమలు చేస్తూ పౌరహక్కులు హరిస్తున్నారని... దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకొని ప్రజల హక్కులు కాపాడాలని కేంద్రాన్ని కోరారు.

ఎంపీ కేశినాని నాని
ఎంపీ కేశినాని నాని
అమరావతిలో పౌరహక్కులు హరిస్తున్నారన్న ఎంపీ కేశినేని నాని

అమరావతి ఉద్యమంపై పోలీసు చర్యలను లోక్‌సభలో ఎంపీ కేశినేని లేవనెత్తారు. 377 నిబంధన కింద సభ దృష్టికి తీసుకువచ్చిన నాని... అమరావతిలో నిరసనకారులపై పోలీసులు దారుణంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత ఆందోళన ద్వారానే స్వాతంత్య్ర ఉద్యమం జరిగిందన్న ఆయన.. అదే తరహాలో ఏపీలో రాజధాని పరిరక్షణ ఉద్యమం జరుగుతోందన్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ పౌరహక్కులు హరిస్తున్నారని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకోవాలని కేంద్రాన్ని కోరిన కేశినేని... ప్రజల హక్కులు కాపాడేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

అమరావతిలో పౌరహక్కులు హరిస్తున్నారన్న ఎంపీ కేశినేని నాని

అమరావతి ఉద్యమంపై పోలీసు చర్యలను లోక్‌సభలో ఎంపీ కేశినేని లేవనెత్తారు. 377 నిబంధన కింద సభ దృష్టికి తీసుకువచ్చిన నాని... అమరావతిలో నిరసనకారులపై పోలీసులు దారుణంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత ఆందోళన ద్వారానే స్వాతంత్య్ర ఉద్యమం జరిగిందన్న ఆయన.. అదే తరహాలో ఏపీలో రాజధాని పరిరక్షణ ఉద్యమం జరుగుతోందన్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ పౌరహక్కులు హరిస్తున్నారని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకోవాలని కేంద్రాన్ని కోరిన కేశినేని... ప్రజల హక్కులు కాపాడేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

వైద్య, ఆరోగ్యశాఖలో మే నాటికి సిబ్బంది నియమాకం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.