ETV Bharat / city

'సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు'

author img

By

Published : Apr 29, 2021, 3:16 PM IST

Updated : Apr 30, 2021, 7:04 AM IST

సంగం డెయిరీ డైరెక్టర్ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. సంగం డెయిరీపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైంది.

సంగం డెయిరీ డైరెక్టర్ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సంగం డెయిరీ డైరెక్టర్ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

సంగం డెయిరీ ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని సంగం డెయిరీ డైరెక్టర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే సంగం డెయిరీ విషయంలో జోక్యం చేసుకుంటోందన్నారు. జీవో అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. గురువారం పిటిషనర్‌ తరఫు వాదనలు ముగియడంతో.. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) వాదనల కోసం విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకుంటూ ఈ నెల 27న జారీ అయిన జీవో 19ను సవాలు చేస్తూ సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌ఎంపీసీఎల్‌) డైరెక్టర్‌ వి.ధర్మారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ‘డెయిరీ భూములను పాల ఉత్పత్తిదారుల భాగస్వామ్యంతో కొన్నారు. డెయిరీని సహకార సంఘంగా మారుస్తూ 43 ఏళ్ల కిందట ఇచ్చిన జీవోను ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించింది. గుంటూరు జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (జీడీఎంపీసీయూఎల్‌)ను.. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (జీడీఎంపీఎంఏసీయూఎల్‌)గా మార్చే క్రమంలో ప్రభుత్వానికి ఉన్న బకాయిలు, మూలధనం వాటాను తిరిగి చెల్లించారు. డెయిరీలో ప్రభుత్వ ఆస్తులు ఏమీ లేవు. జీడీఎంపీఎంఏసీయూఎల్‌గా మార్చడంపై అభ్యంతరం ఉంటే ఏపీడీడీసీ అప్పట్లోనే కో-ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సింది. తర్వాత కంపెనీ చట్టం కింద ఎస్‌ఎంపీసీఎల్‌గా రిజిస్ట్రేషన్‌ చేశాం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాక డెయిరీ విషయంలో జోక్యం ఎక్కువైంది. డెయిరీలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని భావిస్తే సంబంధిత అథార్టీ వద్దకు వెళ్లి పోరాడాలి. అంతేతప్ప.. ఆస్తులు, యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకోవడం వాటాదారుల హక్కులను హరించడమే. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవో అమలును నిలుపుదల చేయండి’ అని పిటిషనర్‌ తరఫున వాదించిన ఆదినారాయణరావు కోరారు. ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. విచారణను మే 3కు వాయిదా వేయాలని కోరగా న్యాయమూర్తి అంగీకరించారు.

సంగం డెయిరీ ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని సంగం డెయిరీ డైరెక్టర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే సంగం డెయిరీ విషయంలో జోక్యం చేసుకుంటోందన్నారు. జీవో అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. గురువారం పిటిషనర్‌ తరఫు వాదనలు ముగియడంతో.. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) వాదనల కోసం విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకుంటూ ఈ నెల 27న జారీ అయిన జీవో 19ను సవాలు చేస్తూ సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌ఎంపీసీఎల్‌) డైరెక్టర్‌ వి.ధర్మారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ‘డెయిరీ భూములను పాల ఉత్పత్తిదారుల భాగస్వామ్యంతో కొన్నారు. డెయిరీని సహకార సంఘంగా మారుస్తూ 43 ఏళ్ల కిందట ఇచ్చిన జీవోను ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించింది. గుంటూరు జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (జీడీఎంపీసీయూఎల్‌)ను.. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (జీడీఎంపీఎంఏసీయూఎల్‌)గా మార్చే క్రమంలో ప్రభుత్వానికి ఉన్న బకాయిలు, మూలధనం వాటాను తిరిగి చెల్లించారు. డెయిరీలో ప్రభుత్వ ఆస్తులు ఏమీ లేవు. జీడీఎంపీఎంఏసీయూఎల్‌గా మార్చడంపై అభ్యంతరం ఉంటే ఏపీడీడీసీ అప్పట్లోనే కో-ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సింది. తర్వాత కంపెనీ చట్టం కింద ఎస్‌ఎంపీసీఎల్‌గా రిజిస్ట్రేషన్‌ చేశాం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాక డెయిరీ విషయంలో జోక్యం ఎక్కువైంది. డెయిరీలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని భావిస్తే సంబంధిత అథార్టీ వద్దకు వెళ్లి పోరాడాలి. అంతేతప్ప.. ఆస్తులు, యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకోవడం వాటాదారుల హక్కులను హరించడమే. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవో అమలును నిలుపుదల చేయండి’ అని పిటిషనర్‌ తరఫున వాదించిన ఆదినారాయణరావు కోరారు. ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. విచారణను మే 3కు వాయిదా వేయాలని కోరగా న్యాయమూర్తి అంగీకరించారు.

ఇదీ చదవండీ... సర్కారు నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టులో సంగం డైరెక్టర్ల పిటిషన్

Last Updated : Apr 30, 2021, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.