ETV Bharat / city

PROJECTS: నిండుకుండలా జలాశయాలు.. పొంగుతున్న నదులు

గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో జలశయాలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని మడ్డువలస జలశయానికి వరద పోటెత్తుతుంది. తమ్మలేరు జలశయానికి భారీగా వరద వస్తుండగా.. 3గేట్లు వదిలి దిగువకు నీటిని వదులుతున్నారు.

author img

By

Published : Sep 28, 2021, 9:07 AM IST

Updated : Sep 28, 2021, 10:03 AM IST

Reservoirs filled with heavy rains effect of gulab
Reservoirs filled with heavy rains effect of gulab

ఎడతెరిపి లేని వర్షాలకు పలు చోట్ల జలశయాల నీటి మట్టాలు పెరిగాయి. విశాఖలోని సీలేరు కాంప్లెక్స్ లోని డొంకరాయి జలశయానికి వరద ఉద్ధృతి ఎక్కువైంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. జలాశయం 2 గేట్లు ఎత్తి 6,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మం. తమ్మిలేరు జలాశయానికి వరద ఉద్ధృతి ఎక్కువైంది. జలాశయం 3 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు జలాశయం ఇన్‌ఫ్లో 7,182 క్యూసెక్కులు కాగా..ఔట్‌ఫ్లో 7,136 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 351.3 అడుగులు ఉంది. దాని గరిష్ఠ నీటి మట్టం 355 అడుగులు. తమ్మిలేరు జలాశయం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఎర్రకాల్వ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎర్రకాల్వ జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాల్లో పంట పొలాలు నీటి మునిగాయి.

తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి, వేగవతి.. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గీతనాపల్లి, కొండచాకరాపల్లి, కొప్పెర గ్రామాలు.. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మడ్డువలస జలాశయం నుంచి నాగావళి నదిలోకి నీరు విడుదల చేయడంతో.. నారాయణపురం ఆనకట్టతోపాటు శ్రీకాకుళం నగరంలో నాగావళి నది జోరుగా ప్రవహిస్తోంది. గోట్టా బ్యారేజ్ నుంచి వంశధార వరద నీరును దిగువకు విడుదల చేస్తున్నారు.

విశాఖలోని ఎలమంచిలి-గాజువాక రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన పైనుంచి శారద నది పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రాకపోకలు నిలిపివేశారు.

ఇదీ చదవండి: GULAB EFFECT ON CROPS: పంటలపై గులాబ్‌ పంజా

ఎడతెరిపి లేని వర్షాలకు పలు చోట్ల జలశయాల నీటి మట్టాలు పెరిగాయి. విశాఖలోని సీలేరు కాంప్లెక్స్ లోని డొంకరాయి జలశయానికి వరద ఉద్ధృతి ఎక్కువైంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. జలాశయం 2 గేట్లు ఎత్తి 6,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మం. తమ్మిలేరు జలాశయానికి వరద ఉద్ధృతి ఎక్కువైంది. జలాశయం 3 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు జలాశయం ఇన్‌ఫ్లో 7,182 క్యూసెక్కులు కాగా..ఔట్‌ఫ్లో 7,136 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 351.3 అడుగులు ఉంది. దాని గరిష్ఠ నీటి మట్టం 355 అడుగులు. తమ్మిలేరు జలాశయం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఎర్రకాల్వ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎర్రకాల్వ జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాల్లో పంట పొలాలు నీటి మునిగాయి.

తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి, వేగవతి.. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గీతనాపల్లి, కొండచాకరాపల్లి, కొప్పెర గ్రామాలు.. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మడ్డువలస జలాశయం నుంచి నాగావళి నదిలోకి నీరు విడుదల చేయడంతో.. నారాయణపురం ఆనకట్టతోపాటు శ్రీకాకుళం నగరంలో నాగావళి నది జోరుగా ప్రవహిస్తోంది. గోట్టా బ్యారేజ్ నుంచి వంశధార వరద నీరును దిగువకు విడుదల చేస్తున్నారు.

విశాఖలోని ఎలమంచిలి-గాజువాక రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన పైనుంచి శారద నది పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రాకపోకలు నిలిపివేశారు.

ఇదీ చదవండి: GULAB EFFECT ON CROPS: పంటలపై గులాబ్‌ పంజా

Last Updated : Sep 28, 2021, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.