ETV Bharat / city

'అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు'... కోర్టులో పోలీసుల కౌంటర్​

author img

By

Published : Jan 21, 2021, 5:46 PM IST

మాజీ మంత్రి, తెదేపా నేత అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణలోని సికింద్రాబాద్ కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆమె బెయిల్ మంజూరు చేయకూడదని బెయిల్​ పిటిషన్​పై పోలీసులు కౌంటర్​ దాఖలు చేశారు.

police fill counter
పోలీసుల కౌంటర్​ దాఖలు

మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్​ మంజూరు చేయకూడదని తెలంగాణ పోలీసులు సికింద్రాబార్​ కోర్టును కోరారు. ఆమె దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​పై న్యాయస్థానంలో విచారణలో భాగంగా పోలీసులు కౌంటర్​ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ కౌంటర్​లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలామంది పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు.

అఖిలప్రియ విచారణకు సహకరిస్తారని ఆమె తరఫు న్యాయవాదలు కోర్టుకు చెప్పారు. ఆమె అనారోగ్యానికి గురైన కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అటు భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్​రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్​ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది.

మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్​ మంజూరు చేయకూడదని తెలంగాణ పోలీసులు సికింద్రాబార్​ కోర్టును కోరారు. ఆమె దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​పై న్యాయస్థానంలో విచారణలో భాగంగా పోలీసులు కౌంటర్​ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ కౌంటర్​లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలామంది పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు.

అఖిలప్రియ విచారణకు సహకరిస్తారని ఆమె తరఫు న్యాయవాదలు కోర్టుకు చెప్పారు. ఆమె అనారోగ్యానికి గురైన కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అటు భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్​రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్​ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: 'ఏ తప్పు చేయకపోయినా పత్రికా విలేకరిపై కేసులా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.