పోలవరం ప్రాజెక్టు భూ సేకరణ ప్రత్యేకాధికారి (స్పెషల్ కలెక్టర్) ఇ.మురళిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణలో డి-పట్టాల(D patta) మంజూరుకు సంబంధించిన కుంభకోణంలో ఆరోపణలు రావడంతో మురళిని బదిలీ చేసింది. హెడ్ క్వార్టర్స్కు రిపోర్టు చేయాలని స్పెషల్ కలెక్టర్ మురళిని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులిచ్చారు. పోలవరం భూ సేకరణలో అక్రమాలపై "ఈటీవీ భారత్- ఈనాడు" ప్రసారం చేసిన కథనాలకు స్పందించిన సర్కార్.. ఈ మేరకు చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేశ్ కుమార్ మీనా నిమామకం