ETV Bharat / city

ఏపీ విద్యార్థితో ముచ్చటించిన ప్రధాని మోదీ... 'గారు' అంటే అర్థం చెప్పారా? అని ఛలోక్తి - తెలుగు విద్యార్థితో ప్రధాని మోదీ ముచ్చట

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో నూతనంగా నిర్మించిన రాణీ లక్ష్మీభాయి వ్యవసాయ విశ్వవిద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్​ విద్యార్థి టోనీ మనోజ్​ కుమార్​తో ఛలోక్తిగా మాట్లాడిన మోదీ...సహాధ్యాయులకు 'గారు' అంటే అర్థం చెప్పారా? అని అడిగారు.

ఏపీ విద్యార్థితో ముచ్చటించిన ప్రధాని మోదీ
ఏపీ విద్యార్థితో ముచ్చటించిన ప్రధాని మోదీ
author img

By

Published : Aug 30, 2020, 6:00 AM IST

Updated : Aug 30, 2020, 7:58 AM IST

ఏపీ విద్యార్థితో ముచ్చటించిన ప్రధాని మోదీ

'గారు' అంటే అర్థమేంటో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మీ సహాధ్యాయులకు చెప్పారా అని ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ విద్యార్థిని ప్రధాని మోదీ ఛలోక్తిగా అడిగారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఝాన్సీలో నూతనంగా నిర్మించిన రాణీ లక్ష్మీభాయి వ్యవసాయ విశ్వవిద్యాలయ భవనం ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న వివిధ రాష్ట్రాల విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు.

కృష్ణా జిల్లా విద్యార్థి టోనీ మనోజ్​ కుమార్​తో మోదీ ఇలా ముచ్చటించారు.

  • విద్యార్థి: నమస్కారం..
  • ప్రధాని: నమస్కారం..మీ పేరేంటి. ?
  • విద్యార్థి: టోనీ మనోజ్‌కుమార్ సార్
  • ప్రధాని: నీ పేరు టోనీనా లేక మనోజ్‌కుమారా.?
  • విద్యార్థి: నా పేరు టోనీ
  • ప్రధాని: అయితే నీపేరు టోనీగారు అన్నమాట, ఝాన్సీలో ఉన్నవాళ్లకు గారు అంటే అర్థమేంటో చెప్పారా..?
  • విద్యార్థి: చెప్పాను సార్........తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నేను తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను సార్..?
  • ప్రధాని: తెలుగులోనే మాట్లాడండి...బాగుంటుంది.
  • ప్రధాని: నాకు బాగా అర్థమైంది...నేను ఆశీర్వదించేటంతటివాడిని కాదు. నేను మీ సహచరుడినే. మనమందరం కలిసి ప్రకృతి, పరమాత్ముడి ఆశీర్వాదం పొంది లక్ష్యాన్ని చేరుకోవాలి.

ఆంధ్రప్రదేశ్​లో అధికంగా పండే వరి, మామిడి, చింత, పొగాకు, పసుపు పంటల గురించి ఇక్కడున్న 22 రాష్ట్రాల విద్యార్థులకు తెలిపానని మనోజ్​ కుమార్ చెప్పారు. సేంద్రియసాగు వైపు రైతులను మళ్లించేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అని ప్రధాని అడగ్గా.. మీరు ప్రారంభించిన భూసారపరీక్షలు, వేపపూత యూరియా వల్ల ఎరువుల వినియోగం 10శాతం తగ్గిందని, ఆ మేరకు రైతులకు , భూమికి మేలు జరుగుతోందని మనోజ్​ తెలిపారు.

ఇదీ చదవండి : తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ఏపీ విద్యార్థితో ముచ్చటించిన ప్రధాని మోదీ

'గారు' అంటే అర్థమేంటో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మీ సహాధ్యాయులకు చెప్పారా అని ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ విద్యార్థిని ప్రధాని మోదీ ఛలోక్తిగా అడిగారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఝాన్సీలో నూతనంగా నిర్మించిన రాణీ లక్ష్మీభాయి వ్యవసాయ విశ్వవిద్యాలయ భవనం ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న వివిధ రాష్ట్రాల విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు.

కృష్ణా జిల్లా విద్యార్థి టోనీ మనోజ్​ కుమార్​తో మోదీ ఇలా ముచ్చటించారు.

  • విద్యార్థి: నమస్కారం..
  • ప్రధాని: నమస్కారం..మీ పేరేంటి. ?
  • విద్యార్థి: టోనీ మనోజ్‌కుమార్ సార్
  • ప్రధాని: నీ పేరు టోనీనా లేక మనోజ్‌కుమారా.?
  • విద్యార్థి: నా పేరు టోనీ
  • ప్రధాని: అయితే నీపేరు టోనీగారు అన్నమాట, ఝాన్సీలో ఉన్నవాళ్లకు గారు అంటే అర్థమేంటో చెప్పారా..?
  • విద్యార్థి: చెప్పాను సార్........తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నేను తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను సార్..?
  • ప్రధాని: తెలుగులోనే మాట్లాడండి...బాగుంటుంది.
  • ప్రధాని: నాకు బాగా అర్థమైంది...నేను ఆశీర్వదించేటంతటివాడిని కాదు. నేను మీ సహచరుడినే. మనమందరం కలిసి ప్రకృతి, పరమాత్ముడి ఆశీర్వాదం పొంది లక్ష్యాన్ని చేరుకోవాలి.

ఆంధ్రప్రదేశ్​లో అధికంగా పండే వరి, మామిడి, చింత, పొగాకు, పసుపు పంటల గురించి ఇక్కడున్న 22 రాష్ట్రాల విద్యార్థులకు తెలిపానని మనోజ్​ కుమార్ చెప్పారు. సేంద్రియసాగు వైపు రైతులను మళ్లించేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అని ప్రధాని అడగ్గా.. మీరు ప్రారంభించిన భూసారపరీక్షలు, వేపపూత యూరియా వల్ల ఎరువుల వినియోగం 10శాతం తగ్గిందని, ఆ మేరకు రైతులకు , భూమికి మేలు జరుగుతోందని మనోజ్​ తెలిపారు.

ఇదీ చదవండి : తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Last Updated : Aug 30, 2020, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.