'గారు' అంటే అర్థమేంటో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మీ సహాధ్యాయులకు చెప్పారా అని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థిని ప్రధాని మోదీ ఛలోక్తిగా అడిగారు. ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీలో నూతనంగా నిర్మించిన రాణీ లక్ష్మీభాయి వ్యవసాయ విశ్వవిద్యాలయ భవనం ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న వివిధ రాష్ట్రాల విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు.
కృష్ణా జిల్లా విద్యార్థి టోనీ మనోజ్ కుమార్తో మోదీ ఇలా ముచ్చటించారు.
- విద్యార్థి: నమస్కారం..
- ప్రధాని: నమస్కారం..మీ పేరేంటి. ?
- విద్యార్థి: టోనీ మనోజ్కుమార్ సార్
- ప్రధాని: నీ పేరు టోనీనా లేక మనోజ్కుమారా.?
- విద్యార్థి: నా పేరు టోనీ
- ప్రధాని: అయితే నీపేరు టోనీగారు అన్నమాట, ఝాన్సీలో ఉన్నవాళ్లకు గారు అంటే అర్థమేంటో చెప్పారా..?
- విద్యార్థి: చెప్పాను సార్........తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నేను తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను సార్..?
- ప్రధాని: తెలుగులోనే మాట్లాడండి...బాగుంటుంది.
- ప్రధాని: నాకు బాగా అర్థమైంది...నేను ఆశీర్వదించేటంతటివాడిని కాదు. నేను మీ సహచరుడినే. మనమందరం కలిసి ప్రకృతి, పరమాత్ముడి ఆశీర్వాదం పొంది లక్ష్యాన్ని చేరుకోవాలి.
ఆంధ్రప్రదేశ్లో అధికంగా పండే వరి, మామిడి, చింత, పొగాకు, పసుపు పంటల గురించి ఇక్కడున్న 22 రాష్ట్రాల విద్యార్థులకు తెలిపానని మనోజ్ కుమార్ చెప్పారు. సేంద్రియసాగు వైపు రైతులను మళ్లించేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అని ప్రధాని అడగ్గా.. మీరు ప్రారంభించిన భూసారపరీక్షలు, వేపపూత యూరియా వల్ల ఎరువుల వినియోగం 10శాతం తగ్గిందని, ఆ మేరకు రైతులకు , భూమికి మేలు జరుగుతోందని మనోజ్ తెలిపారు.
ఇదీ చదవండి : తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు