![వివాదాల్లేని భూములనే ఇళ్ల స్థలాలకివ్వాలి: పవన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6211473_letter.jpg)
ఇళ్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వివాదాలు లేని భూములనే ఇవ్వాలని సూచించారు. నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇస్తుందన్నారు. ఓ వైపు రాజధాని రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ఆ భూములకు పట్టాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయటం సరికాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోనూ స్థలాల కోసం ఇచ్చిన భూముల్లోనూ వివాదాల్లో ఉన్నాయని చెప్పారు. అసైన్డ్ భూములు, విద్యా సంస్థల భూములు, శ్మశాన భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వడం చూస్తుంటే.. పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.