ETV Bharat / city

90 గుడ్లు..ఒకేసారి.. ఈ నెలలో విద్యార్థులకు పంపిణీ - 90 గుడ్లు..ఒకేసారి

మధ్యాహ్న భోజన పథకం కింద ఈ ఒక్క నెలలోనే ఒక్కో విద్యార్థికి 90 కోడిగుడ్ల చొప్పున అందనున్నాయి. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో మధ్యాహ్న భోజనం సరకులను వాలంటీర్ల ద్వారా విద్యార్థులకు ఇస్తున్నారు. మార్చి 19 నుంచి ఆగస్టు 31 మధ్య కాలానికి సంబంధించిన సరకులను 4 విడతల్లో ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 23 వరకు సరకులను పంపిణీ చేశారు.

one time 90 eggs - EEnadu
one time 90 eggs - EEnadu
author img

By

Published : Aug 14, 2020, 9:17 AM IST

అన్నీ ఒకేసారి...

ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు ఉన్న 40 పనిదినాలకు అందాల్సిన 34 గుడ్లను 17 చొప్పున రెండుసార్లు ఇవ్వాలని నిర్ణయించారు. చాలా పాఠశాలలకు ఈ సమయంలో గుడ్లు సరఫరా కాలేదు. వీటిని విద్యార్థులకు ఇవ్వకుండానే తాజాగా జూన్‌ 12 నుంచి ఆగస్టు 31 వరకు 62 పనిదినాలకు మరో 56 గుడ్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ రెండు విడతలకు చెందిన మొత్తం 90 గుడ్లను ఈ నెలలోనే ఇస్తారు. పల్లీ చిక్కీలదీ ఇదే పరిస్థితి. మూడు, నాలుగు విడతలవీ కలిపి ఒక్కో విద్యార్థికి 56 వరకు రానున్నాయి. పంపిణీని ఇప్పటికే కొన్ని చోట్ల మొదలుపెట్టారు. సరకుల పంపిణీ సకాలంలో జరిగితే ఇంటి దగ్గరున్న విద్యార్థులకు పోషకాహారం అందుతుంది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ కోడిగుడ్లను ఇవ్వడం వల్ల చెడిపోయే అవకాశం ఉంది.

అన్నీ ఒకేసారి...

ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు ఉన్న 40 పనిదినాలకు అందాల్సిన 34 గుడ్లను 17 చొప్పున రెండుసార్లు ఇవ్వాలని నిర్ణయించారు. చాలా పాఠశాలలకు ఈ సమయంలో గుడ్లు సరఫరా కాలేదు. వీటిని విద్యార్థులకు ఇవ్వకుండానే తాజాగా జూన్‌ 12 నుంచి ఆగస్టు 31 వరకు 62 పనిదినాలకు మరో 56 గుడ్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ రెండు విడతలకు చెందిన మొత్తం 90 గుడ్లను ఈ నెలలోనే ఇస్తారు. పల్లీ చిక్కీలదీ ఇదే పరిస్థితి. మూడు, నాలుగు విడతలవీ కలిపి ఒక్కో విద్యార్థికి 56 వరకు రానున్నాయి. పంపిణీని ఇప్పటికే కొన్ని చోట్ల మొదలుపెట్టారు. సరకుల పంపిణీ సకాలంలో జరిగితే ఇంటి దగ్గరున్న విద్యార్థులకు పోషకాహారం అందుతుంది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ కోడిగుడ్లను ఇవ్వడం వల్ల చెడిపోయే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.