ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలకు శంఖారావం నేడే

author img

By

Published : Jan 23, 2021, 4:16 AM IST

Updated : Jan 23, 2021, 6:49 AM IST

ఎట్టకేలకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల శంఖాన్ని నేడు ఎస్​ఈసీ పూరించనుంది. 4 దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించిన ఎస్​ఈసీ... ఇవాళ తొలి దఫా ఎన్నికల నోటిఫికేషన్​ను విడుదల చేయనుంది. ఎన్నికల ప్రక్రియలోని వివిధ తేదీలను ప్రకటిస్తూనే మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా... ఇకపైనా దీన్ని కఠినంగా అమలు చేసేలా అధికారులకు ఎస్​ఈసీ దిశానిర్దేశం చేయనున్నారు.

పంచాయతీ ఎన్నికలకు శంఖారావం నేడే
పంచాయతీ ఎన్నికలకు శంఖారావం నేడే
పంచాయతీ ఎన్నికలకు శంఖారావం నేడే

కరోనా దృష్ట్యా గత మార్చ్​లో వాయిదా పడిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ... ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కాబోతుంది. ఎస్​ఈసీ, ప్రభుత్వం వాదోపవాదాలతో వాయిదా పడుతూ వస్తున్న పల్లె పోరుకు నేటి నుంచి తెరలేవనుంది. పంచాయతీ ఎన్నికలకు గతేడాది మార్చ్ 15న నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా... కరోనా వ్యాప్తి వల్ల వాయిదా వేస్తున్నట్టు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ప్రకటించారు. అప్పుడు నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించగా... ఇప్పుడూ ఆ విధంగానే చేపట్టనున్నారు. ఇప్పటికే షెడ్యూల్​ను ఎన్నికల కమిషన్ విడుదల చేయగా.... ఇవాళ ఉదయం 10 గంటలకు తొలి దఫా పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ కానుంది.

తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు 27వ తేదీ వరకూ గడువు ఉండగా.. 28న వాటిని పరిశీలించనున్నారు. ఉపసంహరణకు జనవరి 31 మధ్యాహ్నం 3 గంటల వరకూ అవకాశముండగా... ఆ తర్వాత అదే రోజున తుది జాబితాను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి ఐదో తేదీన ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. ఫలితాలు వెల్లడించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు.

నాలుగు రోజుల వ్యవధిలోనే మిగతా విడతల ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. జనవరి 27, 31, ఫిబ్రవరి 4 తేదీల్లో... 2,3,4 దఫాల పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ అవనున్నాయి. ఫిబ్రవరి 9,13,17 తేదీల్లో ఆయా విడతల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 17 వరకూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. గ్రామాలవారీ రిజర్వేషన్లను.... గతేడాది మార్చ్​లోనే ఈసీ నిర్ణయించగా.... ఇప్పుడు వాటినే అమలు చేయనున్నారు.

ఇదీ చదవండి:

పంచాయతీరాజ్ కమిషనర్ తీరుపై ఎస్​ఈసీ అసంతృప్తి

పంచాయతీ ఎన్నికలకు శంఖారావం నేడే

కరోనా దృష్ట్యా గత మార్చ్​లో వాయిదా పడిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ... ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కాబోతుంది. ఎస్​ఈసీ, ప్రభుత్వం వాదోపవాదాలతో వాయిదా పడుతూ వస్తున్న పల్లె పోరుకు నేటి నుంచి తెరలేవనుంది. పంచాయతీ ఎన్నికలకు గతేడాది మార్చ్ 15న నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా... కరోనా వ్యాప్తి వల్ల వాయిదా వేస్తున్నట్టు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ప్రకటించారు. అప్పుడు నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించగా... ఇప్పుడూ ఆ విధంగానే చేపట్టనున్నారు. ఇప్పటికే షెడ్యూల్​ను ఎన్నికల కమిషన్ విడుదల చేయగా.... ఇవాళ ఉదయం 10 గంటలకు తొలి దఫా పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ కానుంది.

తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు 27వ తేదీ వరకూ గడువు ఉండగా.. 28న వాటిని పరిశీలించనున్నారు. ఉపసంహరణకు జనవరి 31 మధ్యాహ్నం 3 గంటల వరకూ అవకాశముండగా... ఆ తర్వాత అదే రోజున తుది జాబితాను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి ఐదో తేదీన ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. ఫలితాలు వెల్లడించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు.

నాలుగు రోజుల వ్యవధిలోనే మిగతా విడతల ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. జనవరి 27, 31, ఫిబ్రవరి 4 తేదీల్లో... 2,3,4 దఫాల పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ అవనున్నాయి. ఫిబ్రవరి 9,13,17 తేదీల్లో ఆయా విడతల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 17 వరకూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. గ్రామాలవారీ రిజర్వేషన్లను.... గతేడాది మార్చ్​లోనే ఈసీ నిర్ణయించగా.... ఇప్పుడు వాటినే అమలు చేయనున్నారు.

ఇదీ చదవండి:

పంచాయతీరాజ్ కమిషనర్ తీరుపై ఎస్​ఈసీ అసంతృప్తి

Last Updated : Jan 23, 2021, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.