ETV Bharat / city

NHRC on Kaleshwaram project: కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయండి : ఎన్​హెచ్​ఆర్​సీ

author img

By

Published : Dec 13, 2021, 6:26 PM IST

NHRC on Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ అందిన ఫిర్యాదుపై.. ఎన్​హెచ్​ఆర్​సీ స్పందించింది. ఈ అంశంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది.

NHRC on Kaleshwaram project
NHRC on Kaleshwaram project

NHRC on Kaleshwaram project: కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్​హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు అందింది. బ్యాక్ వాటర్ వల్ల 30 నుంచి 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. పంటనష్టంతో రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదుదారుడి తరఫు న్యాయవాది.. కమిషన్​ దృష్టికి తెచ్చారు.

ఫిర్యాదుపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్​సీ​.. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

NHRC on Kaleshwaram project: కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్​హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు అందింది. బ్యాక్ వాటర్ వల్ల 30 నుంచి 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. పంటనష్టంతో రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదుదారుడి తరఫు న్యాయవాది.. కమిషన్​ దృష్టికి తెచ్చారు.

ఫిర్యాదుపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్​సీ​.. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

Jagan bail cancellation petition: జగన్ బెయిల్ రద్దుపై ఎంపీ రఘురామ పిటిషన్..విచారణ 2 వారాలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.