తండ్రి లేని కుమార్తెల పెళ్లి ఖర్చులకు అండగా నిలిచేందుకు ముత్తూట్ ఫైనాన్స్ ముందుకొచ్చింది. వితంతువులైన తల్లులు.. ఆర్థిక అవరోధాలు అధిగమించేందుకు, వారి కుమార్తెల వివాహ అవసరాలు తీర్చేందుకు ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్.. 'ముత్తూట్ వివాహ కానుక'ను అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లక్డీకపూల్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిలు హాజరయ్యారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద.. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని, నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్ ఈ పథకాన్ని ప్రారంభించిందని.. సంస్థ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ తెలిపారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడులో అమలు చేసిన ఈ పథకాన్ని హైదరాబాద్లోనూ అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరానికి తొమ్మిది మంది బాలికలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది 20 మందికి లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Atchanna: 'ప్రభుత్వం చేసిన రూ. 2 లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయి?'