తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో మదర్ థెరిస్సా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఈ వేడుకలను జరిపారు. మదర్ థెరిస్సా చిత్రపటానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. థెరిస్సా సేవా గుణాన్ని గుర్తు చేసుకున్న నేతలు.. జోలె పట్టి అనాథల కడుపు నింపి అమ్మగా నిలిచారని కొనియాడారు. థెరిస్సాకు మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్బాబు, గన్ని వీరాంజనేయులు, ఏవీ రమణ, దొరబాబు, దారపనేని నరేంద్రబాబు, వల్లూరి కుమార స్వామి.. నివాళులర్పించారు.
ఇదీ చదవండీ.. విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ఇబ్బందుల్లో 15 గ్రామాల ప్రజలు