ETV Bharat / city

రైతులపై ఆర్థిక భారం మోపేందుకు కుట్ర: ఎమ్మెల్యే సాంబశివరావు - ys jagan

నగదు బదిలీ పేరుతో వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేసే చర్యలకు పూనుకోవడం సరికాదని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రైతులపై ఆర్థిక భారం మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

mla Yeluri Sambasiva Rao
mla Yeluri Sambasiva Rao
author img

By

Published : Sep 3, 2020, 5:32 AM IST

నగదు బదిలీ పేరుతో వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేసే చర్యలకు పూనుకోవడం సరికాదని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రైతులకు అన్యాయం చేసేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నారన్న ఆయన... రాష్ట్రంలోని 18 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం మోపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. గత 15 నెలల జగన్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. రైతు సంక్షేమం పై గతంలో చాలా మాటలు చెప్పిన జగన్‌...అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక రైతు పథకాలను రద్దు చేశారన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ఉపయోగపడే బిందుసేద్యం పథకానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా దుర్మార్గమన్నారు.

ఇదీ చదవండి

నగదు బదిలీ పేరుతో వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేసే చర్యలకు పూనుకోవడం సరికాదని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రైతులకు అన్యాయం చేసేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నారన్న ఆయన... రాష్ట్రంలోని 18 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం మోపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. గత 15 నెలల జగన్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. రైతు సంక్షేమం పై గతంలో చాలా మాటలు చెప్పిన జగన్‌...అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక రైతు పథకాలను రద్దు చేశారన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ఉపయోగపడే బిందుసేద్యం పథకానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా దుర్మార్గమన్నారు.

ఇదీ చదవండి

ఆంగ్ల మాధ్యమంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.