ETV Bharat / city

జల్ జీవన్ మిషన్​పై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

author img

By

Published : Nov 11, 2020, 11:15 PM IST

డిసెంబరు 31 నాటికి జల జీవన్ మిషన్ పనులు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. జల జీవన్ మిషన్ పై సమీక్షించిన ఆయన...నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలన్నారు. రెండ్రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు.

Minister peddireddy
Minister peddireddy

జల జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను హెచ్చరించారు. అధికారుల స్థాయిల్లో లక్ష్యాలు నిర్దేశించుకుని గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయంలో రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వమిచ్చిన గడువులోగా జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.

రెండ్రోజుల్లో టెండర్లు పిలిచి వీలైనంత వేగంగా పనులు మొదలు పెట్టాలని మంత్రి సూచించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటివారి పైనైనా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. జల జీవన్ మిషన్ పనులు 2021 జనవరి 11 లోగా పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ 31 నాటికే ఈ పనులు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు.

జల జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను హెచ్చరించారు. అధికారుల స్థాయిల్లో లక్ష్యాలు నిర్దేశించుకుని గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయంలో రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వమిచ్చిన గడువులోగా జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.

రెండ్రోజుల్లో టెండర్లు పిలిచి వీలైనంత వేగంగా పనులు మొదలు పెట్టాలని మంత్రి సూచించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటివారి పైనైనా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. జల జీవన్ మిషన్ పనులు 2021 జనవరి 11 లోగా పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ 31 నాటికే ఈ పనులు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి

విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలపై విద్యాశాఖ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.