ETV Bharat / city

Peddi Reddy: తెలంగాణ మంత్రుల మాటలు సరికాదు: పెద్దిరెడ్డి

author img

By

Published : Jun 25, 2021, 6:50 PM IST

రాయలసీమకు నీళ్లివ్వాలని కేసీఆరే(KCR)స్వయంగా జగన్(CM Jagan)​కు చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి(Peddi Reddy) అన్నారు. కేసీఆర్ మాటలకు తానే ప్రత్యక్ష సాక్షినని ఆయన చెప్పారు.

Minister Peddi Reddy
Minister Peddi Reddy

రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తామని గతంలో కేసీఆర్‌(KCR) స్వయంగా జగన్​(CM Jagan)తోనే చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి(Peddi Reddy) అన్నారు. కేసీఆర్ మాటలకు తానే ప్రత్యక్ష సాక్షినని మంత్రి అన్నారు. రాయలసీమకు సాగు, తాగునీరు ఇచ్చేలా చూడాలని కేసీఆరే చెప్పారని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి(Peddi Reddy) స్పష్టం చేశారు.

ఏపీకి రావాల్సిన నీటి వాటాను మాత్రమే వాడుకుంటున్నామన్న పెద్దిరెడ్డి..ఎక్కువ నీరు వాడుకోవాలని జగన్ ప్రభుత్వం ఆలోచించదని వివరించారు. తెలంగాణకు వైఎస్ ఎంతో సేవ చేశారని కేసీఆర్ పొగిడారని.. మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తామని గతంలో కేసీఆర్‌(KCR) స్వయంగా జగన్​(CM Jagan)తోనే చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి(Peddi Reddy) అన్నారు. కేసీఆర్ మాటలకు తానే ప్రత్యక్ష సాక్షినని మంత్రి అన్నారు. రాయలసీమకు సాగు, తాగునీరు ఇచ్చేలా చూడాలని కేసీఆరే చెప్పారని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి(Peddi Reddy) స్పష్టం చేశారు.

ఏపీకి రావాల్సిన నీటి వాటాను మాత్రమే వాడుకుంటున్నామన్న పెద్దిరెడ్డి..ఎక్కువ నీరు వాడుకోవాలని జగన్ ప్రభుత్వం ఆలోచించదని వివరించారు. తెలంగాణకు వైఎస్ ఎంతో సేవ చేశారని కేసీఆర్ పొగిడారని.. మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి:

DOUBLE MURDER: జంటహత్యల కేసులో నిందితులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.