రాష్ట్రంలో వెలుగుచూసిన ఈఎస్ఐ కుంభకోణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం బయటపడినట్లు తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, సామగ్రి కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగినట్టు చెప్పారు. మరిన్ని అంశాలపై మంత్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి.