రాష్ట్ర సమస్యల కోసమే దిల్లీ పర్యటన
కొంతమంది విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని...జగన్ దిల్లీ పర్యటనపైనా రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం దిల్లీ పర్యటనకు వెళ్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే అమిత్షాను కలుస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ షాను సీఎం జగన్ కలవడంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. దిల్లీ పర్యటనలో అందుబాటులో ఉన్న మంత్రులందరినీ జగన్ కలుస్తారని వెల్లడించారు.
సీఎం దిల్లీ పర్యటనపై రాద్దాంతం సరికాదు: మంత్రి అనిల్
ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనపై తెదేపా నేతలు రాద్దాంతం చేయటం సరికాదని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే దిల్లీ పర్యటనకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో ఇప్పటివరకు జలవనరుల శాఖలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర సమస్యల కోసమే దిల్లీ పర్యటన
కొంతమంది విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని...జగన్ దిల్లీ పర్యటనపైనా రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం దిల్లీ పర్యటనకు వెళ్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే అమిత్షాను కలుస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ షాను సీఎం జగన్ కలవడంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. దిల్లీ పర్యటనలో అందుబాటులో ఉన్న మంత్రులందరినీ జగన్ కలుస్తారని వెల్లడించారు.