తెలుగు ప్రజలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదంతా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే.. కరోనాకు చిక్కకుండా ఎవరికి వారు.. ఇంటి పరిధిలోనే ఉగాదిని జరపుకోవాలంటూ ట్వీట్ చేశారు.
'అలా ఉండాలంటే ఇంటి పరిధిలోనే వేడుకలు చేసుకోండి'
తెలుగు ప్రజలకు తెదేపా నేతలు నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ఇంటి పరిధిలోనే ఉగాది వేడుకలను జరుపుకోవాలని సూచించారు.
!['అలా ఉండాలంటే ఇంటి పరిధిలోనే వేడుకలు చేసుకోండి' lokesh ugadi wishes to telugu people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6535397-135-6535397-1585114296643.jpg?imwidth=3840)
మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కరోనా రూపంలో దేశం ప్రళయాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రధాని మోదీ మనందరిని చేతులెత్తి వేడుకున్నారని గుర్తు చేశారు. అయ్యప్పమాల, రంజాన్ ఉపవాసాల తరహాలో ఈ ఉగాదికి 21 రోజుల లాక్డౌన్ దీక్ష చేద్దామని పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదంతా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే.. కరోనాకు చిక్కకుండా ఎవరికి వారు.. ఇంటి పరిధిలోనే ఉగాదిని జరపుకోవాలంటూ ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కరోనా రూపంలో దేశం ప్రళయాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రధాని మోదీ మనందరిని చేతులెత్తి వేడుకున్నారని గుర్తు చేశారు. అయ్యప్పమాల, రంజాన్ ఉపవాసాల తరహాలో ఈ ఉగాదికి 21 రోజుల లాక్డౌన్ దీక్ష చేద్దామని పిలుపునిచ్చారు.