ETV Bharat / city

'రైతులకు బేడీలా? ఇదేనా రైతు రాజ్యం?'

author img

By

Published : Oct 27, 2020, 5:11 PM IST

రాజధాని రైతులకు బేడీలు వేయటంపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి.. తక్షణమే వారిని విడుదల చేయాలని లోకేశే డిమాండ్ చేశారు.

lokesh fire
lokesh fire

రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు బేడీలు వేయటాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తప్పుబట్టారు. సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. వరదలతో నిండా మునిగిన రైతుల్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఇదేనా జగన్ రెడ్డి తెస్తానన్న రైతు రాజ్యమని నిలదీశారు.

3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపమైతే.. తమ జీవితం అనుకున్న భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు వారికెంత కోపం రావాలని ప్రశ్నించారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి.. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే.. న్యాయం జరిగేవరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు బేడీలు వేయటాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తప్పుబట్టారు. సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. వరదలతో నిండా మునిగిన రైతుల్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఇదేనా జగన్ రెడ్డి తెస్తానన్న రైతు రాజ్యమని నిలదీశారు.

3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపమైతే.. తమ జీవితం అనుకున్న భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు వారికెంత కోపం రావాలని ప్రశ్నించారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి.. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే.. న్యాయం జరిగేవరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.