ETV Bharat / city

కర్ణాటక రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్​కు చేరిన మృతదేహాలు

karnataka Accident Dead Bodies Reached Hyderabad: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అయితే ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. ముగ్గురి మృతదేహాలు మాత్రమే భాగ్యనగర్​కు చేరుకున్నాయి.

author img

By

Published : Jun 4, 2022, 3:37 PM IST

karnataka Accident Bodies Reached Hyderabad
karnataka Accident Bodies Reached Hyderabad

karnataka road accident: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్‌ వాసులు మరణించగా.. వారిలో ముగ్గురి మృతదేహాలు భాగ్యనగరానికి చేరుకున్నాయి. గోడేకీ కబర్‌కు చెందిన శివకుమార్‌, రవళి, దీక్షిత్‌ మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులు గోడే కీ కబర్​కు తీసుకెళ్లారు. ముగ్గురి మృతదేహాలకు గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ నివాళులర్పించారు. పురానాపూల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అర్జున్‌కుమార్‌, సరళాదేవి, దివాన్ష్‌, అనిత మృతదేహాలను ఇవాళ తరలించనున్నారు. గత నెల 28న గోవాకు వెళ్లిన 26 మంది తిరిగి హైదరాబాద్​ వస్తుండగా.. గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అనుకోని సంఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అన్ని మృతదేహాలకు కర్ణాటకలోనే పోస్టుమార్టం పూర్తికాగా.. ముగ్గురి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇవాళ మిగతావారి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలకు రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.

karnataka Accident Bodies Reached Hyderabad
ఘటనకు ముందు.. బస్సులో దిగిన ఫొటో

Road Accident Karnataka: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఢీ కొట్టిన ఘటనలో వీరంతా సజీవదహనమయ్యారు. గోవాలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రెండు కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు.

ఇవీ చదవండి:

karnataka road accident: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్‌ వాసులు మరణించగా.. వారిలో ముగ్గురి మృతదేహాలు భాగ్యనగరానికి చేరుకున్నాయి. గోడేకీ కబర్‌కు చెందిన శివకుమార్‌, రవళి, దీక్షిత్‌ మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులు గోడే కీ కబర్​కు తీసుకెళ్లారు. ముగ్గురి మృతదేహాలకు గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ నివాళులర్పించారు. పురానాపూల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అర్జున్‌కుమార్‌, సరళాదేవి, దివాన్ష్‌, అనిత మృతదేహాలను ఇవాళ తరలించనున్నారు. గత నెల 28న గోవాకు వెళ్లిన 26 మంది తిరిగి హైదరాబాద్​ వస్తుండగా.. గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అనుకోని సంఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అన్ని మృతదేహాలకు కర్ణాటకలోనే పోస్టుమార్టం పూర్తికాగా.. ముగ్గురి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇవాళ మిగతావారి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలకు రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.

karnataka Accident Bodies Reached Hyderabad
ఘటనకు ముందు.. బస్సులో దిగిన ఫొటో

Road Accident Karnataka: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఢీ కొట్టిన ఘటనలో వీరంతా సజీవదహనమయ్యారు. గోవాలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రెండు కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.