గుంటూరు జిల్లా మందడంలో రైతులు చేపట్టిన ధర్నాకు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆందోళనల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాజధాని రైతుల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. రాజధాని కోసం న్యాయస్థానాల్లో కేసులు వేస్తామని స్పష్టం చేశారు.
రాజధాని తరలింఫును ఉన్మాద చర్యగా అభివర్ణించారు. అమరావతికి రక్షణగా ఎన్నో చట్టాలున్నాయని... ఒక్క కలంపోటుతో రాజధాని తరలిస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. జీఎన్ రావు కమిటీకి ఏం చట్టబద్ధత ఉందని ప్రశ్నించారు. రాజధానే కాదు... హైకోర్టు తరలింఫును వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని, హైకోర్టు తరలించాక అమరావతిలో ఇంకేముంటుందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : సమరావతి: రాజధాని రైతుల జలదిగ్బంధం