రాష్ట్రంలో శాఖల వారీగా ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన సమాచారంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి.. ఉదయం 11 గంటలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. ఉద్యోగాలను గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీలుగావిభజన చేసి భర్తీ చేయనున్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో విడతల వారీగా.. ఆయా కొలువుల భర్తీకి ఎపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అన్నీ కలిపి 10 వేల 143 కొలువుల భర్తీకి సన్నద్ధమైన సర్కార్ విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో జూలైలో 1,238 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా 36 పోస్టులకు ప్రకటన జారీ చేస్తామని పేర్కొంది. పోలీస్ శాఖలో 450 పోస్టులకు సెప్టెంబరులో 451 వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అక్టోబరులో ప్రకటన వస్తుందని తెలిపింది. ఇక నవంబర్లో అత్యధికంగా 5,251 మంది పారామెడికల్ సిబ్బంది, డిసెంబరులో–441 మంది నర్సుల నియామకానికి ప్రకటన వస్తుందని వెల్లడించింది. ఇక 2022 జనవరిలో 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి ఫిబ్రవరిలో 2 వేల పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందని తెలిపింది. మార్చిలో.. వేర్వురు శాఖల ద్వారా మరో 36 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని వెల్లడించింది.
జూలై–2021 | 1,238 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్లాగ్ పోస్టులు |
ఆగస్టు–2021 | 36 ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు |
సెప్టెంబరు–2021 | పోలీస్ శాఖలో 450 కొలువులు |
అక్టోబరు–2021 | 451 వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు |
నవంబరు–2021 | 5,251 పారామెడికల్ పోస్టులు |
డిసెంబరు–2021 | 441 నర్సు పోస్టులు |
జనవరి–2022 | 240 డిగ్రీ కాలేజీల లెక్చరర్ల పోస్టులు |
ఫిబ్రవరి–2022 | వర్సిటీల్లో 2,000 అసిస్టెంట్ ప్రొఫెసర్లు |
మార్చి–2022 | ఇతర శాఖల్లో 36 పోస్టులు |
ఇదీ చదవండి: మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన హైకోర్టు