ETV Bharat / city

LIQUOR SEIZED: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులు... అక్రమ మద్యం పట్టివేత

author img

By

Published : Jun 13, 2021, 10:10 PM IST

అక్రమ మద్యం రవాణాకు అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కోడి పెంట మాటున అక్రమ మద్యం తరిలించాలనుకుని పోలీసులకు చిక్కారు. మరోచోట ప్రత్యేకంగా తయారుచేసిన బాక్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

state wide liquor raids
state wide liquor raids

కోడి పెంట మాటున..

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమ మద్యం రవాణాకు అడ్డుపడటంలేదు. అక్రమార్కులు కొత్త కొత్త మార్గాల్లో మద్యం తరలిస్తూ పట్టుపడుతున్నారు. కోళ్ల వ్యర్థాలు మాటున తరలిస్తున్న 133 కర్ణాటక మద్యం బాటిళ్లను నెల్లూరు జిల్లా కోవూరు సెబ్ అధికారులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న వారు పరారవ్వగా, మద్యాన్ని, వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సెబ్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులో...

కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద సెబ్ అధికారులు తెలంగాణ మద్యం పట్టుకున్నారు. కర్నూలు సంతోష్​నగర్​కు చెందిన మహబూబ్ బాషా ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులో మద్యం తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలు, ఆటోను సెబ్ అధికారులు సీజ్ చేశారు.

బెల్లం ఊట ధ్వంసం..

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని నాటు సారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేసిన అధికారులు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంస చేశారు. 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: suhasini case: సుహాసిని కేసులో మరో ట్విస్ట్​.. తెరపైకి రెండో భర్త

కోడి పెంట మాటున..

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమ మద్యం రవాణాకు అడ్డుపడటంలేదు. అక్రమార్కులు కొత్త కొత్త మార్గాల్లో మద్యం తరలిస్తూ పట్టుపడుతున్నారు. కోళ్ల వ్యర్థాలు మాటున తరలిస్తున్న 133 కర్ణాటక మద్యం బాటిళ్లను నెల్లూరు జిల్లా కోవూరు సెబ్ అధికారులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న వారు పరారవ్వగా, మద్యాన్ని, వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సెబ్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులో...

కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద సెబ్ అధికారులు తెలంగాణ మద్యం పట్టుకున్నారు. కర్నూలు సంతోష్​నగర్​కు చెందిన మహబూబ్ బాషా ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులో మద్యం తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలు, ఆటోను సెబ్ అధికారులు సీజ్ చేశారు.

బెల్లం ఊట ధ్వంసం..

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని నాటు సారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేసిన అధికారులు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంస చేశారు. 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: suhasini case: సుహాసిని కేసులో మరో ట్విస్ట్​.. తెరపైకి రెండో భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.