ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు చూసైనా.. నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వరద సాయం అందని వారికి ఏడో తేదీ నాటికి అందజేయాలని.. లేదంటే ప్రగతి భవన్, గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: