ETV Bharat / city

గ్లోబల్ మేయర్ల సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ మేయర్ విజయలక్మ్షి

author img

By

Published : Apr 17, 2021, 10:02 AM IST

గ్లోబల్ మేయర్ల సమావేశంలో హైదరాబాద్ మేయర్ విజయలక్మ్షి ప్రసంగించారు. ఐరాస ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రపంచంలోని 40 ప్రముఖ నగరాల మేయర్లకు సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించారు. భారత్‌ నుంచి జీహెచ్‌ఎంసీ మేయర్‌ మాత్రమే ప్రసంగించారు. హైదరాబాద్‌లో కర్బన ఉద్గారాలు తగ్గించే చర్యలు, కొవిడ్ మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి విజయలక్ష్మి వివరించారు.

hyderabad mayor
గ్లోబల్ మేయర్ల సమావేశంలో ప్రసంగిస్తున్న హైదరాబాద్ మేయర్ విజయలక్మ్షి

విశ్వనగరంగా ఎదుగుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టామని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు. ఐదు మిలియన్ల మొక్కలు నాటడం, 64 వేల హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్‌ల అభివృద్ది, ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఐరాస ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మేయర్ల సమావేశంలో హైదరాబాద్ మేయర్ విజయలక్మ్షి ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటారెస్, లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిగ్ గర్సెట్టి... కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయడం, హరిత పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, అవలంభించాల్సిన లక్ష్యాలపై చర్చించారు.

ప్రపంచంలోని 40 ప్రముఖ నగరాల మేయర్లకు మాత్రమే ఈ సదస్సులో పాల్గొనడానికి అవకాశం లభించగా... భారత్‌ నుంచి హైదరాబాద్ మేయర్ మాత్రమే ప్రసంగించడానికి అవకాశం లభించింది. జీహెచ్​ఎంసీలో విద్యుత్ వినియోగం 15 శాతం తగ్గించేందుకుగాను సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉపయోగం, ఇంధన వినియోగం తగ్గించే విధంగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌లను ప్రవేశపెట్టామని వివరించారు.

తమ ప్రభుత్వం వేగంగా చేపట్టిన ముందస్తు చర్యలు, వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాలతో కరోనా సాధారణ స్థితికి తేవడంలో సఫలం అయ్యామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్​లో కర్బన వాయువులను తగ్గించేందుకు సీఎం కేసీఆర్​, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​​ల నాయకత్వంలో బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి:

500 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి: రెవెన్యూ శాఖ

విశ్వనగరంగా ఎదుగుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టామని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు. ఐదు మిలియన్ల మొక్కలు నాటడం, 64 వేల హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్‌ల అభివృద్ది, ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఐరాస ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మేయర్ల సమావేశంలో హైదరాబాద్ మేయర్ విజయలక్మ్షి ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటారెస్, లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిగ్ గర్సెట్టి... కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయడం, హరిత పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, అవలంభించాల్సిన లక్ష్యాలపై చర్చించారు.

ప్రపంచంలోని 40 ప్రముఖ నగరాల మేయర్లకు మాత్రమే ఈ సదస్సులో పాల్గొనడానికి అవకాశం లభించగా... భారత్‌ నుంచి హైదరాబాద్ మేయర్ మాత్రమే ప్రసంగించడానికి అవకాశం లభించింది. జీహెచ్​ఎంసీలో విద్యుత్ వినియోగం 15 శాతం తగ్గించేందుకుగాను సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉపయోగం, ఇంధన వినియోగం తగ్గించే విధంగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌లను ప్రవేశపెట్టామని వివరించారు.

తమ ప్రభుత్వం వేగంగా చేపట్టిన ముందస్తు చర్యలు, వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాలతో కరోనా సాధారణ స్థితికి తేవడంలో సఫలం అయ్యామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్​లో కర్బన వాయువులను తగ్గించేందుకు సీఎం కేసీఆర్​, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​​ల నాయకత్వంలో బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి:

500 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి: రెవెన్యూ శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.